ETV Bharat / state

రంగులు వేస్తున్న కూలీలపైకి దూసుకెళ్లిన లారీ...ఒకరు మృతి

author img

By

Published : Nov 5, 2020, 5:44 PM IST

రహదారి డివైడర్​కు మార్కింగ్ చేస్తున్న కూలీలపైకి లారీ దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా... మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

Road accident on Vannepudi National Highway at eastgodavari district
వన్నెపూడి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం...ఒకరు మృతి...ముగ్గురికి గాయాలు

తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడి జాతీయ రహదారిపై డివైడర్​కు మార్కింగ్​ వేస్తున్న కూలీలపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గోకవరం మండలం తిరుమలాయిపాలె వాసి పాము దుర్గారావు మృతి చెందాడు. మరో ముగ్గురు గాయపడ్డారు. వీరిని ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

రోడ్డుపై మార్కింగ్ ఇచ్చి చిన్న వ్యాన్ అడ్డుగా పెట్టి పని చేసుకుంటున్నారు. వీరిపైకి రాజమహేంద్రవరం నుంచి విశాఖ వైపు వెళ్తున్న లారీ దూసుకెళ్ళింది. పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

వివాహ వేడుకకు సతీసమేతంగా సీఎం జగన్

తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడి జాతీయ రహదారిపై డివైడర్​కు మార్కింగ్​ వేస్తున్న కూలీలపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గోకవరం మండలం తిరుమలాయిపాలె వాసి పాము దుర్గారావు మృతి చెందాడు. మరో ముగ్గురు గాయపడ్డారు. వీరిని ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

రోడ్డుపై మార్కింగ్ ఇచ్చి చిన్న వ్యాన్ అడ్డుగా పెట్టి పని చేసుకుంటున్నారు. వీరిపైకి రాజమహేంద్రవరం నుంచి విశాఖ వైపు వెళ్తున్న లారీ దూసుకెళ్ళింది. పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

వివాహ వేడుకకు సతీసమేతంగా సీఎం జగన్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.