ETV Bharat / state

కోనసీమలో మోస్తరుగా కురిసిన వాన

author img

By

Published : Jun 29, 2020, 1:36 PM IST

పచ్చదనంతో కన్నుల విందుగా ఉండే కోనసీమను తొలకరి చినుకులు పలకరించాయి. రుతుపవనాల కారణంగా తూర్పు గోదావరి జిల్లాలో మోస్తరు వర్షం పడటంతో, రైతులు ఖరీఫ్ పంట వేసేందుకు సమయాత్తమవుతున్నారు.

rain in konseema
కోనసీమలో వర్షం

తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచే మబ్బులు పట్టి.. పలు చోట్ల మోస్తరు వర్షం పడింది. పి గన్నవరం నాగూల్ లంక, అయినవిల్లి, ముక్తేశ్వరం తదితర గ్రామాల్లో మోస్తరుగా వానలు పడ్డాయి. కొన్ని పల్లపు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. ఖరీఫ్ నారుమడులు వేసేందుకు ఈ వర్షం ఎంతో ఉపయోగపడుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచే మబ్బులు పట్టి.. పలు చోట్ల మోస్తరు వర్షం పడింది. పి గన్నవరం నాగూల్ లంక, అయినవిల్లి, ముక్తేశ్వరం తదితర గ్రామాల్లో మోస్తరుగా వానలు పడ్డాయి. కొన్ని పల్లపు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. ఖరీఫ్ నారుమడులు వేసేందుకు ఈ వర్షం ఎంతో ఉపయోగపడుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: నిషేధిత జాబితాలో సదనం భూములు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.