ETV Bharat / state

బాధ్యతారాహిత్యం.... మాంసం కోసం గుమిగూడిన జనం

author img

By

Published : Apr 5, 2020, 12:03 PM IST

కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించాలంటే సామాజిక దూరం పాటించాలని ఓ పక్క ప్రభుత్వాలు, అధికారులు చెబుతున్నా కొంతమందిలో అవగాహన రావటం లేదు. మార్కెట్​ల వద్ద నిర్లక్ష్యంగా గుమిగూడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో మాంసం కోసం దుకాణాల వద్ద ప్రజలు ప్రమాదకరంగా గుమిగూడారు.

social distance
social distance
బాధ్యతా రాహిత్యం.... మాంసం కోసం గుమిగూడిన జనం

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వాలు ఎన్నిసార్లు చెబుతున్నా కొందరు తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఆదివారం కావటంతో తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో మాంసం దుకాణాల వద్ద ప్రజలు గుమిగూడారు. ప్రతి దుకాణం వద్ద మార్కింగ్​లు గీసి అందులో కొనుగోలుదారులు నిలబడేలా అవగాహన కల్పించాలని దుకాణ యజమానులకు చెప్పినా వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు ప్రమాదకరంగా గుమిగూడినా అక్కడ పట్టించుకునే వారు ఎవరూ లేరు.

ఇదీ చదవండి: కరోనా ఉగ్రరూపం... ఆరు రోజుల్లో 169 కేసులు

బాధ్యతా రాహిత్యం.... మాంసం కోసం గుమిగూడిన జనం

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వాలు ఎన్నిసార్లు చెబుతున్నా కొందరు తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఆదివారం కావటంతో తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో మాంసం దుకాణాల వద్ద ప్రజలు గుమిగూడారు. ప్రతి దుకాణం వద్ద మార్కింగ్​లు గీసి అందులో కొనుగోలుదారులు నిలబడేలా అవగాహన కల్పించాలని దుకాణ యజమానులకు చెప్పినా వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు ప్రమాదకరంగా గుమిగూడినా అక్కడ పట్టించుకునే వారు ఎవరూ లేరు.

ఇదీ చదవండి: కరోనా ఉగ్రరూపం... ఆరు రోజుల్లో 169 కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.