ETV Bharat / state

మానవత్వపు గూడు.. బుజ్జి కూనలకు చేదోడు

వీధి కుక్కలంటే మనకు చాలా చిరాకనిపిస్తుంది. వాటికి అన్నం పెట్టడం కాదు కదా... కనీసం మన ఇంటివైపే రానివ్వం.. కానీ రాజమహేంద్రవరంలోని ఓ వ్యక్తి చేసిన పని చూస్తే.. భలే చేశావ్ అని అభినందిస్తారు.

author img

By

Published : Sep 19, 2019, 10:07 PM IST

మానవత్వం చాటుకున్నావ్​ అన్నా..!
మానవత్వం చాటుకున్నావ్​ అన్నా..!

సాధారణంగా వీధికుక్కలను చూస్తే ఎవరైనా అసహ్యించుకుంటారు. వాటిని ఇంటి దరిదాపులకు కూడా రానివ్వరు. కానీ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పేపర్ మిల్లు సమీపంలో ఉన్న శ్రీరామ్​ నగర్​కు చెందిన రాజు... వీధి కుక్కలకు ఆహారం వేస్తుంటాడు. అయితే అతను కొన్ని రోజులు వేరే ఊరు వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఆ వీధిలో ఉన్న ఓ కుక్క ఆటోలో 8 పిల్లలకు జన్మనిచ్చింది. ఎవరో ఆటోలో నుంచి ఆ పిల్లలను కిందకు దించేశారు. దీంతో... ఆ కుక్క తన పిల్లలను రక్షించుకోవటానికి తుప్పల్లోకి తీసుకెళ్లింది. కానీ ఆ చిట్టి కూనలకు చీమలు కుట్టటంతో కూని రాగాలు తీస్తుండగా.. గమనించిన రాజు ఆ బుజ్జి పిల్లలకు హాని జరగకుండా వీధిలోని ఓ చెట్టు కింద చాపవేసి దానిపైన అనువుగా గూడు ఏర్పాటు చేశాడు. వాటి ఆలనా పాలనా చూసుకుంటూ మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తున్నాడు.

మానవత్వం చాటుకున్నావ్​ అన్నా..!

సాధారణంగా వీధికుక్కలను చూస్తే ఎవరైనా అసహ్యించుకుంటారు. వాటిని ఇంటి దరిదాపులకు కూడా రానివ్వరు. కానీ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పేపర్ మిల్లు సమీపంలో ఉన్న శ్రీరామ్​ నగర్​కు చెందిన రాజు... వీధి కుక్కలకు ఆహారం వేస్తుంటాడు. అయితే అతను కొన్ని రోజులు వేరే ఊరు వెళ్ళి తిరిగి వచ్చేసరికి ఆ వీధిలో ఉన్న ఓ కుక్క ఆటోలో 8 పిల్లలకు జన్మనిచ్చింది. ఎవరో ఆటోలో నుంచి ఆ పిల్లలను కిందకు దించేశారు. దీంతో... ఆ కుక్క తన పిల్లలను రక్షించుకోవటానికి తుప్పల్లోకి తీసుకెళ్లింది. కానీ ఆ చిట్టి కూనలకు చీమలు కుట్టటంతో కూని రాగాలు తీస్తుండగా.. గమనించిన రాజు ఆ బుజ్జి పిల్లలకు హాని జరగకుండా వీధిలోని ఓ చెట్టు కింద చాపవేసి దానిపైన అనువుగా గూడు ఏర్పాటు చేశాడు. వాటి ఆలనా పాలనా చూసుకుంటూ మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తున్నాడు.

ఇదీ చూడండి:

తెలుపు రంగు కాకిని ఎప్పుడైనా చూశారా?

Intro:AP_CDP_28_19_DEBBATHINNA_ROADS_AP10121


Body:కడప జిల్లాలో ఉగ్రరూపం దాల్చిన కుందు నది తో రైతులకు నష్టం వాటిల్లడం కాకుండా పలుచోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. నదీ పరివాహక ప్రాంతంలో కి నీరు విస్తరించడంతో పంట పొలాలు కొన్ని చోట్ల కోతకు గురి కావడమే కాకుండా మరికొన్ని చోట్ల మేట వేశాయి దువ్వూరు మండలంలో టంగుటూరు మెట్ట మీదుగా ప్రొద్దుటూరు కి వెళ్లే రహదారిపైకి నీరు ప్రవహించడంతో పెద్ద ఎత్తున రహదారి కోతకు గురై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది . చాపాడు మండలం ఎన్. అనంతపురం కుచ్చుపాప గ్రామాల మధ్య రహదారి కోతకు గురైంది. పెద్ద గోతులు పడ్డాయి. కంకర మట్టి పక్కనే పొలాల్లోకి చేరింది రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దెబ్బతిన్న రహదారులను పంటలను భాజపా నాయకులు పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన రహదారులను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు


Conclusion:Note: sir, వీడియో ఎఫ్ టి పి ద్వారా పంపడమైనది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.