ETV Bharat / state

దాహం తీర్చని వర్షాలు.. లంకవాసులకు తీరని కష్టాలు

ఏళ్లు గడుస్తున్నా, ప్రభుత్వాలు మారుతున్నా... లంకవాసుల కష్టాలు మాత్రం తీరడంలేదు. తూర్పుగోదావరి జిల్లాలోని చెరువుల్లో నీరు ఉన్నా... చుట్టూ ఉన్న గ్రామాలకు నీరందటం లేదు.

author img

By

Published : Jul 22, 2019, 2:28 AM IST

తీరని లంకవాసుల కష్టాలు
తీరని లంకవాసుల కష్టాలు

రోజులు గడుస్తున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి. అయినా అక్కడి ప్రజల కష్టాలు మాత్రం తీరడం లేదు. తూర్పుగోదావరి జిల్లాలోని ముమ్మడివరం, తాళ్లరేవు, ఐ.పోలవరం మండలాల్లో 6 లంక గ్రామాలు ఉన్నాయి. అక్కడ సుమారు 15 వేల మంది ప్రజలు వంశపారంపర్యంగా వస్తున్న ఉపాధి మార్గాలనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఈ మండలాల్లోని ప్రజలు ప్రతి చిన్న అవసరానికి పడవలో ప్రయాణం చేయాలి. కొన్నిసార్లు ఇంజన్​ల లోపాలతో అవి మధ్యలోనే మొరాయిస్తున్నాయి. ఇన్ని ప్రభుత్వాలు మారినా...ప్రయాణ మార్గాలు సరిగ్గా లేక అక్కడి ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు.

వీరికి మరో ప్రధాన సమస్య తాగునీరు. నగరంలో చుట్టూ చెరువులు ఉన్నా లంకగ్రామాలకు మాత్రం నీటిసరఫరా అందించలేకపోతున్నారు అధికారులు. ముఖ్యంగా వర్షాకాలంలో, వరదలు వస్తున్న సమయాల్లో పడరాని పాట్లు పడుతున్నారు స్థానికులు. ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుజల పథకం ద్వారా కొంతవరకు వారి దాహార్తి తీర్చగలుగుతున్నారు. అయినా పూర్తి స్థాయిలో తమ అవసరాలు తీరేలా నీటి సరఫరా లేదని లంక గ్రామాల ప్రజలు ఆవేదన చెందారు. వర్షాలు పడుతున్నా.. తాగు నీటి కోసం డబ్బులు ఖర్చు చేయాల్సివస్తోందని చెబుతున్నారు.

ఇవి చూడండి:'నిశ్శబ్దం'గా ఉండమంటున్న అనుష్క చేతులు

తీరని లంకవాసుల కష్టాలు

రోజులు గడుస్తున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నాయి. అయినా అక్కడి ప్రజల కష్టాలు మాత్రం తీరడం లేదు. తూర్పుగోదావరి జిల్లాలోని ముమ్మడివరం, తాళ్లరేవు, ఐ.పోలవరం మండలాల్లో 6 లంక గ్రామాలు ఉన్నాయి. అక్కడ సుమారు 15 వేల మంది ప్రజలు వంశపారంపర్యంగా వస్తున్న ఉపాధి మార్గాలనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఈ మండలాల్లోని ప్రజలు ప్రతి చిన్న అవసరానికి పడవలో ప్రయాణం చేయాలి. కొన్నిసార్లు ఇంజన్​ల లోపాలతో అవి మధ్యలోనే మొరాయిస్తున్నాయి. ఇన్ని ప్రభుత్వాలు మారినా...ప్రయాణ మార్గాలు సరిగ్గా లేక అక్కడి ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు.

వీరికి మరో ప్రధాన సమస్య తాగునీరు. నగరంలో చుట్టూ చెరువులు ఉన్నా లంకగ్రామాలకు మాత్రం నీటిసరఫరా అందించలేకపోతున్నారు అధికారులు. ముఖ్యంగా వర్షాకాలంలో, వరదలు వస్తున్న సమయాల్లో పడరాని పాట్లు పడుతున్నారు స్థానికులు. ఇటీవల ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుజల పథకం ద్వారా కొంతవరకు వారి దాహార్తి తీర్చగలుగుతున్నారు. అయినా పూర్తి స్థాయిలో తమ అవసరాలు తీరేలా నీటి సరఫరా లేదని లంక గ్రామాల ప్రజలు ఆవేదన చెందారు. వర్షాలు పడుతున్నా.. తాగు నీటి కోసం డబ్బులు ఖర్చు చేయాల్సివస్తోందని చెబుతున్నారు.

ఇవి చూడండి:'నిశ్శబ్దం'గా ఉండమంటున్న అనుష్క చేతులు

ap_ong_62_21_dairy_carmikulu_samma_avb_ap10067 కంట్రిబ్యూటర్ నటరాజు సెంట్రల్ అద్దంకి సంతమాగులూరు మండలం వెల్లలచెరువు లోని తిరుమల మిల్క్ డైరీ ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌ అక్రమ మూసివేతకు నిరసనగా సిఐటియు అద్దంకి ఆధ్వర్యంలో డెయిరీ వద్ద నిరవధిక సమ్మె నిర్వహించారు.సిఐటియు అద్దంకి డివిజన్ కార్యదర్శి సిహెచ్ గంగయ్య పాల్గొన్నారు.డైరీలో పనిచేసే కార్మికులు మరియు సిఐటియు నాయకులు హాజరయ్యారు.డైలీ కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ కార్మికులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా డైరీని మూసివేయడం తగదన్నారు. కార్మికులకు ఉద్యోగం తప్ప మరొకటి ఏది అవసరం లేదని తెలియజేశారు. BITE : డైరీ కార్మిక సంఘ నాయకులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.