తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో నెలకొన్న సమస్యలపై ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వతపూర్ణ చంద్రప్రసాద్ అధికారులతో సమీక్షించారు. కరోనా వ్యాప్తి చెందకుండా చేపడుతున్న చర్యలు, తాగునీటి ఇబ్బందులు, పారిశుద్ధ్య నిర్వాహణ తదితర అంశాలపై చర్చించారు. సెక్టార్ రిఫారమ్స్ స్కీమ్ ద్వారా నీటి సరఫరాపై చర్చించి అనంతరం లోపాలపై నివేదిక ఇవ్వాలని అధికారులతో కమిటీని నియమించారు. ఈ కమిటీ నివేదికను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
ఇదీచదవండి.