ETV Bharat / state

"ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త" - ఎంఎస్​ఎంఈలకు కూటమి ప్రభుత్వం చేయూత - CM Review on MSME Draft Policy

ఎంఎస్​ఎంఈల ద్వారా ఐదేళ్లలో రూ.50 వేల కోట్ల పెట్టుబడులు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

CM_REVIEW_ON_MSME_DRAFT_POLICY
CM_REVIEW_ON_MSME_DRAFT_POLICY (ETV Bharat)

CM Chandrababu Review on MSME Draft Policy in AP : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగం ద్వారా ఐదేళ్లలో రూ. 50,000ల కోట్ల పెట్టుబడులను రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. ఇందుకోసం మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కొత్తగా 100 ఎంఎస్​ఎంఈ పార్కులను అభివృద్ధి చేయడంతోపాటు 500 లకు పైగా ఎంఎస్ఎంఈలను అంతర్జాతీయ మార్కెట్‌తో పోటీ పడేలా తీర్చిదిద్దాలని ప్రణాళిక రచిస్తోంది. అధికారులు ప్రతిపాదించిన ముసాయిదా పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు.

రూ. 50 వేల కోట్ల పెట్టుబడులు : మేడిన్‌ ఆంధ్రా పేరిట ఎంఎస్​ఎంఈల ఉత్పత్తులకు బ్రాండ్‌ ఇమేజ్‌ తీసుకొచ్చి అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం కనీసం 500 ఎంఎస్​ఎంఈలను గుర్తించి నిర్వాహకులకు అసరమైన శిక్షణ, మౌలిక సదుపాయాలను కల్పించేందుకు సన్నద్ధమవుతోంది. ఎగుమతులకు అవకాశాలున్న 10 రంగాలను గుర్తించి వాటికి సంబంధించి ఎంఎస్​ఎంఈల కోసం మార్గదర్శకాలను రూపొందించాలని భావిస్తోంది.

ఇందులో భాగంగా ఉత్పత్తుల విక్రయాల ప్రదర్శనలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ-కామర్స్‌ ఎగుమతులకు అనుసంధానం, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ వంటి అంశాల్లో సహకరించాలని యోచిస్తోంది. గ్లోబల్‌ట్రేడ్‌ ఫెసిలిటేషన్‌ కల్పించేందుకు వీలుగా విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలలో 3 కేంద్రాలను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.అధికారులు ప్రతిపాదించిన ముసాయిదా పాలసీ విధివిధానాలపై సీఎం చంద్రబాబు కొన్ని కీలక మార్పులను సూచించారు.

ఐదేళ్లలో ఐదు లక్షల మందికి ఉపాధి : కొత్తగా ఏర్పాటుచేసే ఎంఎస్​ఎంఈలతో పాటు ఇప్పటికే ఉత్పత్తి చేస్తూ సాంకేతికతను మెరుగుపర్చుకుంటున్న ప్రోత్సాహకాలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెట్టుబడి, టర్నోవర్‌ ఆధారంగా ఈ పరిశ్రమలను గుర్తించనుంది. ఫిక్స్‌డ్‌ కాస్ట్‌ సబ్సిడీ కింద వాటికి స్టాంపుడ్యూటీ, క్యాపిటల్‌ సబ్సిడీ ఇవ్వనుంది. ఆపరేటింగ్‌ కాస్ట్‌ కింద ఎస్​జీఎస్టీ రియంబర్స్‌మెంట్, స్కిల్‌ అప్‌గ్రేడేషన్‌ ఖర్చు, లోకల్‌ ప్రొక్యూర్‌మెంట్‌ సబ్సిడీ, కేంద్ర పథకాలకు అనుగుణంగా క్వాలిటీ సర్టిఫికేషన్‌ తీసుకునేందుకు చేసిన మొత్తాన్ని సబ్సిడీ కింద ప్రభుత్వం భరించనుంది.

కొత్తగా వంద ఎంఎస్​ఎంఈ పార్కులు : విద్యుత్‌ ఛార్జీల రాయితీ యూనిట్‌కు రూపాయి ఇవ్వనుంది. ఎనిమిది కీలకాంశాల ఆధారంగా రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈ రంగానికి ఊపిరి పోయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎంఎస్​ఎంఈల ఏర్పాటు కోసం మౌలిక సదుపాయాల కల్పన, కొత్తగా ఏర్పాటుచేసేవారికి మార్గదర్శకత్వం, యూనిట్‌ స్థాయిలో పోటీతత్వాన్ని పెంచటం, వాటి ఆర్థిక అవసరాలు తీర్చేలా తగిన మార్గాల సూచనలతో పాటు స్థిరత్వం కల్పించటంతోపాటు ఉత్పత్తుల విక్రయాలకు అవకాశాలను కల్పించనుంది. రూఫ్‌టాప్‌ సోలార్‌ విద్యుత్‌ ఏర్పాటుచేసుకునేలా ప్రోత్సహించడం దీనివల్ల ఉత్పత్తి వ్యయం తగ్గించే ప్రయత్నం చేయనుంది. అన్ని ఎంఎస్​ఎంఈలకు టెక్నాలజీ అప్‌గ్రేడ్‌ కాస్ట్‌ 20% చొప్పున, 100% ఎస్‌జీఎస్టీ రీయంబర్స్‌మెంట్‌ ఇవ్వనున్నారు.


"ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త" నినాదంతో ముందుకు సాగాలని సీఎం చంద్రబాబు సూచించారు. భారతదేశ ఆర్థిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు సాహసోపేతమైన చర్యల ద్వారా, దూరదృష్టితో దేశవ్యాప్తంగా వ్యవస్థాపకత, ఉపాధి, ఆవిష్కరణలను ప్రోత్సహించాలని చంద్రబాబు సూచించారు. 1.75 లక్షాల ఉద్యోగాల కల్పన లక్ష్యంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఒకటి చొప్పున 175 మైక్రో పార్కులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

5 లక్షల మందికి ఉపాధి లక్ష్యం- ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రంగాలపై ప్రభుత్వం ఫోకస్ - Government Focus on IT in AP

రాష్ట్రంలో కొలువుల ఆశలు - ఉపాధికి ఊతమిచ్చేలా కొత్త ఐటీ పాలసీ - New IT Policy in AP

CM Chandrababu Review on MSME Draft Policy in AP : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగం ద్వారా ఐదేళ్లలో రూ. 50,000ల కోట్ల పెట్టుబడులను రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. ఇందుకోసం మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కొత్తగా 100 ఎంఎస్​ఎంఈ పార్కులను అభివృద్ధి చేయడంతోపాటు 500 లకు పైగా ఎంఎస్ఎంఈలను అంతర్జాతీయ మార్కెట్‌తో పోటీ పడేలా తీర్చిదిద్దాలని ప్రణాళిక రచిస్తోంది. అధికారులు ప్రతిపాదించిన ముసాయిదా పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు.

రూ. 50 వేల కోట్ల పెట్టుబడులు : మేడిన్‌ ఆంధ్రా పేరిట ఎంఎస్​ఎంఈల ఉత్పత్తులకు బ్రాండ్‌ ఇమేజ్‌ తీసుకొచ్చి అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం కనీసం 500 ఎంఎస్​ఎంఈలను గుర్తించి నిర్వాహకులకు అసరమైన శిక్షణ, మౌలిక సదుపాయాలను కల్పించేందుకు సన్నద్ధమవుతోంది. ఎగుమతులకు అవకాశాలున్న 10 రంగాలను గుర్తించి వాటికి సంబంధించి ఎంఎస్​ఎంఈల కోసం మార్గదర్శకాలను రూపొందించాలని భావిస్తోంది.

ఇందులో భాగంగా ఉత్పత్తుల విక్రయాల ప్రదర్శనలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ-కామర్స్‌ ఎగుమతులకు అనుసంధానం, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ వంటి అంశాల్లో సహకరించాలని యోచిస్తోంది. గ్లోబల్‌ట్రేడ్‌ ఫెసిలిటేషన్‌ కల్పించేందుకు వీలుగా విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలలో 3 కేంద్రాలను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.అధికారులు ప్రతిపాదించిన ముసాయిదా పాలసీ విధివిధానాలపై సీఎం చంద్రబాబు కొన్ని కీలక మార్పులను సూచించారు.

ఐదేళ్లలో ఐదు లక్షల మందికి ఉపాధి : కొత్తగా ఏర్పాటుచేసే ఎంఎస్​ఎంఈలతో పాటు ఇప్పటికే ఉత్పత్తి చేస్తూ సాంకేతికతను మెరుగుపర్చుకుంటున్న ప్రోత్సాహకాలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెట్టుబడి, టర్నోవర్‌ ఆధారంగా ఈ పరిశ్రమలను గుర్తించనుంది. ఫిక్స్‌డ్‌ కాస్ట్‌ సబ్సిడీ కింద వాటికి స్టాంపుడ్యూటీ, క్యాపిటల్‌ సబ్సిడీ ఇవ్వనుంది. ఆపరేటింగ్‌ కాస్ట్‌ కింద ఎస్​జీఎస్టీ రియంబర్స్‌మెంట్, స్కిల్‌ అప్‌గ్రేడేషన్‌ ఖర్చు, లోకల్‌ ప్రొక్యూర్‌మెంట్‌ సబ్సిడీ, కేంద్ర పథకాలకు అనుగుణంగా క్వాలిటీ సర్టిఫికేషన్‌ తీసుకునేందుకు చేసిన మొత్తాన్ని సబ్సిడీ కింద ప్రభుత్వం భరించనుంది.

కొత్తగా వంద ఎంఎస్​ఎంఈ పార్కులు : విద్యుత్‌ ఛార్జీల రాయితీ యూనిట్‌కు రూపాయి ఇవ్వనుంది. ఎనిమిది కీలకాంశాల ఆధారంగా రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈ రంగానికి ఊపిరి పోయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎంఎస్​ఎంఈల ఏర్పాటు కోసం మౌలిక సదుపాయాల కల్పన, కొత్తగా ఏర్పాటుచేసేవారికి మార్గదర్శకత్వం, యూనిట్‌ స్థాయిలో పోటీతత్వాన్ని పెంచటం, వాటి ఆర్థిక అవసరాలు తీర్చేలా తగిన మార్గాల సూచనలతో పాటు స్థిరత్వం కల్పించటంతోపాటు ఉత్పత్తుల విక్రయాలకు అవకాశాలను కల్పించనుంది. రూఫ్‌టాప్‌ సోలార్‌ విద్యుత్‌ ఏర్పాటుచేసుకునేలా ప్రోత్సహించడం దీనివల్ల ఉత్పత్తి వ్యయం తగ్గించే ప్రయత్నం చేయనుంది. అన్ని ఎంఎస్​ఎంఈలకు టెక్నాలజీ అప్‌గ్రేడ్‌ కాస్ట్‌ 20% చొప్పున, 100% ఎస్‌జీఎస్టీ రీయంబర్స్‌మెంట్‌ ఇవ్వనున్నారు.


"ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త" నినాదంతో ముందుకు సాగాలని సీఎం చంద్రబాబు సూచించారు. భారతదేశ ఆర్థిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు సాహసోపేతమైన చర్యల ద్వారా, దూరదృష్టితో దేశవ్యాప్తంగా వ్యవస్థాపకత, ఉపాధి, ఆవిష్కరణలను ప్రోత్సహించాలని చంద్రబాబు సూచించారు. 1.75 లక్షాల ఉద్యోగాల కల్పన లక్ష్యంలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఒకటి చొప్పున 175 మైక్రో పార్కులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

5 లక్షల మందికి ఉపాధి లక్ష్యం- ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ రంగాలపై ప్రభుత్వం ఫోకస్ - Government Focus on IT in AP

రాష్ట్రంలో కొలువుల ఆశలు - ఉపాధికి ఊతమిచ్చేలా కొత్త ఐటీ పాలసీ - New IT Policy in AP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.