ETV Bharat / state

'దివిస్' అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే రాజా

author img

By

Published : Dec 19, 2020, 4:39 PM IST

కొత్తపాక గ్రామంలో దివిస్ పరిశ్రమ ఏర్పాటు అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పరిశ్రమను స్థానికంగా నెలకొనకుండా దూర ప్రాంతానికి తరలించేలా కృషి చేస్తానని చెప్పారు.

Mla_Raja_Divis_Parsilana
Mla_Raja_Divis_Parsilana

తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కొత్తపాక గ్రామంలో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పర్యటించారు. ఎట్టిపరిస్థితుల్లో దివిస్ పరిశ్రమను ఏర్పాటు కానివ్వబోమని స్పష్టం చేశారు. కావాలంటే 10 నుంచి 20 కిలోమీటర్ల దూరంగా పరిశ్రమ వెళ్లేలా సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఎమ్మెల్యే రాజా ప్రసంగిస్తున్న సమయంలో పరిశ్రమ పనులను వెంటనే ఆపాలని పలువురు నినాదాలు చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిని విడుదల చేసి.. కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అయితే దీనికి ఎమ్మెల్యే ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి

తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కొత్తపాక గ్రామంలో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పర్యటించారు. ఎట్టిపరిస్థితుల్లో దివిస్ పరిశ్రమను ఏర్పాటు కానివ్వబోమని స్పష్టం చేశారు. కావాలంటే 10 నుంచి 20 కిలోమీటర్ల దూరంగా పరిశ్రమ వెళ్లేలా సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఎమ్మెల్యే రాజా ప్రసంగిస్తున్న సమయంలో పరిశ్రమ పనులను వెంటనే ఆపాలని పలువురు నినాదాలు చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిని విడుదల చేసి.. కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అయితే దీనికి ఎమ్మెల్యే ఎటువంటి సమాధానం ఇవ్వకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి

'విశాఖ ఘటనపై చంద్రబాబు ట్వీట్​ అవాస్తవం'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.