ETV Bharat / state

గ్రీన్​ జోన్​లోకి కొత్తపేట!

కొత్త పేటలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదై 28 రోజులు గడిచాయి. ఆ తర్వాత కొత్తగా పాజిటివ్ కేసు నమోదు కానందున మండలాన్ని జిల్లా కలెక్టర్ గ్రీన్ జోన్ గా ప్రకటించారని ఆర్డీవో భవానీశంకర్ తెలిపారు.

author img

By

Published : Apr 29, 2020, 4:27 PM IST

kattapeta changed red zone to green zone
గ్రీన్​ జోన్​లోకి కొత్తపేట

తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలాన్ని రెడ్​జోన్ నుంచి గ్రీన్ జోన్​కు మార్చిన్నట్లు అమలాపురం ఆర్డీవో భవానీశంకర్ తెలిపారు. కొత్తపేటలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదై 28 రోజులు పూర్తైందని.. తర్వాత కొత్తగా పాజిటివ్ కేసు నమోదు కాలేదని చెప్పారు. ఈ కారణంగానే.. మండలాన్ని జిల్లా కలెక్టర్ గ్రీన్ జోన్ గా ప్రకటించారని ఆర్డీవో వివరించారు.

ఇన్నాళ్లూ ఆంక్షలు ఉన్న ప్రాంతాల్లో.. భారీ గేట్లు తొలగిస్తామని.. గ్రీన్ జోన్​లో చేపట్టే కార్యక్రమాలన్నీ ఇక్కడ కూడా వర్తిస్తాయని చెప్పారు. బ్యాంకుల్లోనూ ఉదయం 8.00 గంటల నుంచి 10.00 గంటల వరకు ప్రజలు, 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు ప్రభుత్వ, వ్యాపార సంబంధమైన లావాదేవీలు కొనసాగుతాయని ఆర్డీవో వివరించారు.

తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలాన్ని రెడ్​జోన్ నుంచి గ్రీన్ జోన్​కు మార్చిన్నట్లు అమలాపురం ఆర్డీవో భవానీశంకర్ తెలిపారు. కొత్తపేటలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదై 28 రోజులు పూర్తైందని.. తర్వాత కొత్తగా పాజిటివ్ కేసు నమోదు కాలేదని చెప్పారు. ఈ కారణంగానే.. మండలాన్ని జిల్లా కలెక్టర్ గ్రీన్ జోన్ గా ప్రకటించారని ఆర్డీవో వివరించారు.

ఇన్నాళ్లూ ఆంక్షలు ఉన్న ప్రాంతాల్లో.. భారీ గేట్లు తొలగిస్తామని.. గ్రీన్ జోన్​లో చేపట్టే కార్యక్రమాలన్నీ ఇక్కడ కూడా వర్తిస్తాయని చెప్పారు. బ్యాంకుల్లోనూ ఉదయం 8.00 గంటల నుంచి 10.00 గంటల వరకు ప్రజలు, 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు ప్రభుత్వ, వ్యాపార సంబంధమైన లావాదేవీలు కొనసాగుతాయని ఆర్డీవో వివరించారు.

ఇవీ చూడండి:

రెడ్​జోన్ ప్రాంతాల్లో సరకుల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.