ETV Bharat / state

'గోపాలరావు చెరువును ఎమ్మెల్యే చంటిబాబు లీజుకిచ్చారు'

author img

By

Published : May 31, 2020, 3:56 PM IST

గోపాలరావు చెరువు మట్టి తవ్వకాలపై అధికారులు ఒక్కోలా చెబుతున్నారని తెదేపా సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ అన్నారు. 83 ఎకరాల చెరువును ఎమ్మెల్యే చంటిబాబు చేపల పెంపకానికి ఇచ్చేశారన్నారు.

jyothula nehru comments on mla chantibabu
jyothula nehru comments on mla chantibabu

548 మంది రైతులకు సంబంధించిన చెరువును లీజుకు ఇచ్చేశారని.. తెదేపా నేత జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాకలో ఆయన మాట్లాడారు. ప్రైవేట్ వ్యక్తులకు ఏడాదికి రూ.50 లక్షలకు చంటిబాబు లీజుకు ఇచ్చారని ధ్వజమెత్తారు. కలెక్టర్ స్పందించినా కిందిస్థాయి అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. రైతులతో కలిసి న్యాయపోరాటం చేస్తానని జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. చెరువును అన్యాక్రాంతం చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. అనుమతి లేకుండా అభివృద్ధి పేరిట పనులు ఎలా చేస్తారు..? అని నిలదీశారు.

548 మంది రైతులకు సంబంధించిన చెరువును లీజుకు ఇచ్చేశారని.. తెదేపా నేత జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాకలో ఆయన మాట్లాడారు. ప్రైవేట్ వ్యక్తులకు ఏడాదికి రూ.50 లక్షలకు చంటిబాబు లీజుకు ఇచ్చారని ధ్వజమెత్తారు. కలెక్టర్ స్పందించినా కిందిస్థాయి అధికారులు పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. రైతులతో కలిసి న్యాయపోరాటం చేస్తానని జ్యోతుల నెహ్రూ స్పష్టం చేశారు. చెరువును అన్యాక్రాంతం చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. అనుమతి లేకుండా అభివృద్ధి పేరిట పనులు ఎలా చేస్తారు..? అని నిలదీశారు.

ఇదీ చదవండి: 'పార్టీ మారే ఉద్దేశం లేదు.. తెదేపాలోనే కొనసాగుతా'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.