ETV Bharat / state

'కాకినాడలోని జగన్నాథపురం ఎస్​బీఐ శాఖలో నకిలీ బంగారంతో రుణాలు'

author img

By

Published : Mar 21, 2021, 2:27 PM IST

Updated : Mar 21, 2021, 2:47 PM IST

కాకినాడలోని జగన్నాథపురం ఎస్​బీఐ శాఖలో నకిలీ బంగారంతో రుణాలు పొందినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో కీలక ఉద్యోగి 15 రోజులుగా విధులకు రాకపోవడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

gold loan robbery in jagannatahpuram
నకిలీ బంగారంతో రుణాలు

కాకినాడ జగన్నాథపురంలోని ఎస్​బీఐ శాఖలో బినామీ వ్యక్తుల పేరుతో నకిలీ బంగారాన్ని కుదువపెట్టి భారీగా రుణాలు పొందిన అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. బ్యాంకులోని ఓ అప్రైజర్​ ప్రమేయంతో అక్రమాలు జరిగినట్లు సమాచారం. దాంతో ఉన్నతాధికారుల బృందం అంతర్గత విచారణ చేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగి 15రోజులుగా విధులకు రాకపోవడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు తనిఖీల్లో భాగంగా మార్చి మొదటివారంలో ఆ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఏ స్థాయిలో అక్రమం జరిగిందన్న అంశంపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీసులు తెలిపారు.

కాకినాడ జగన్నాథపురంలోని ఎస్​బీఐ శాఖలో బినామీ వ్యక్తుల పేరుతో నకిలీ బంగారాన్ని కుదువపెట్టి భారీగా రుణాలు పొందిన అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. బ్యాంకులోని ఓ అప్రైజర్​ ప్రమేయంతో అక్రమాలు జరిగినట్లు సమాచారం. దాంతో ఉన్నతాధికారుల బృందం అంతర్గత విచారణ చేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగి 15రోజులుగా విధులకు రాకపోవడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు తనిఖీల్లో భాగంగా మార్చి మొదటివారంలో ఆ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఏ స్థాయిలో అక్రమం జరిగిందన్న అంశంపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని స్థానిక పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: ఓడలరేవులో ఇసుక అక్రమ తవ్వకాల అడ్డగింత

Last Updated : Mar 21, 2021, 2:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.