దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుండటంతో... రోడ్డుపై నివసించే యాచకులు, నిరాశ్రయులకు ఇబ్బందులు తప్పటం లేదు. నిరాశ్రయుల ఆకలి తీర్చేందుకు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో శ్రీకృష్ణదేవరాయ కల్యాణ మండపంలో ఉచిత భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. సత్తిదొర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమానికి నిరాశ్రయులు బారులు తీరారు.
ఇదీ చదవండి: విలేకర్లకు నిత్యావసరాలు పంపిణీ చేసిన మాజీ ఎమ్మెల్యే