ETV Bharat / state

వ్యాన్​లో చేలరేగిన మంటలు..2 లక్షలు నష్టం!

author img

By

Published : Nov 25, 2021, 9:56 AM IST

సగ్గు బియ్యం లోడుతో వెళ్తున్న వ్యాన్ అగ్ని ప్రమాదానికి గురైన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలో జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

వ్యాన్ లో చేలరేగిన మంటలు
వ్యాన్ లో చేలరేగిన మంటలు
వ్యాన్ లో చేలరేగిన మంటలు

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువు జాతీయ రహదారిపై సగ్గుబియ్యం బస్తాల లోడుతో వెళ్తున్న వ్యాను అగ్నిప్రమాదానికి గురైంది. పెద్దాపురం నుంచి రాజమహేంద్రవరం మార్కెట్​కు వెళ్తున్న వ్యాన్ దివాన్ చెరువు వద్ద జాతీయ రహదారి పక్కన షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంజిన్ నుంచి మంటలు వ్యాపించాయి. వ్యాను ముందుభాగం అగ్నికి ఆహుతి అయింది.

ఇదీ గమనించిన స్థానికులు వ్యానులో ఉన్న 35 సగ్గు బియ్యం బస్తాలను కిందకు లాగేశారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది. మంటలను అదుపు చేశారు. సుమారు రెండు లక్షల వరకు నష్టం జరిగినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: రానున్న రెండేళ్లలో దళితుల అభివృద్ధికి రూ.40వేల కోట్లను ఖర్చు చేస్తాం: మంత్రి పినిపే విశ్వరూప్‌

వ్యాన్ లో చేలరేగిన మంటలు

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువు జాతీయ రహదారిపై సగ్గుబియ్యం బస్తాల లోడుతో వెళ్తున్న వ్యాను అగ్నిప్రమాదానికి గురైంది. పెద్దాపురం నుంచి రాజమహేంద్రవరం మార్కెట్​కు వెళ్తున్న వ్యాన్ దివాన్ చెరువు వద్ద జాతీయ రహదారి పక్కన షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంజిన్ నుంచి మంటలు వ్యాపించాయి. వ్యాను ముందుభాగం అగ్నికి ఆహుతి అయింది.

ఇదీ గమనించిన స్థానికులు వ్యానులో ఉన్న 35 సగ్గు బియ్యం బస్తాలను కిందకు లాగేశారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది. మంటలను అదుపు చేశారు. సుమారు రెండు లక్షల వరకు నష్టం జరిగినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి: రానున్న రెండేళ్లలో దళితుల అభివృద్ధికి రూ.40వేల కోట్లను ఖర్చు చేస్తాం: మంత్రి పినిపే విశ్వరూప్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.