ETV Bharat / state

సెల్​ ఫోన్​ కొనలేదని యువతి ఆత్మహత్య!

author img

By

Published : Jun 2, 2020, 3:23 AM IST

ఓ సెల్​ ఫోన్​ నిండు ప్రాణాన్ని తీసింది. ఇంట్లో జరిగిన గొడవలో తన సెల్​ ఫోన్​ పగిలిపోవటంతో కొత్త ఫోన్​ కొనాలని పట్టుబట్టింది ఓ యువతి. అందుకు కుటుంబ సభ్యులు నిరాకరించడంతో మనస్థాపానికి గురై.. తన ప్రాణాన్నే తీసుకుంది.

సెల్​ ఫోన్​ కొనలేదని యువతి ఆత్మహత్య!
సెల్​ ఫోన్​ కొనలేదని యువతి ఆత్మహత్య!

తూర్పు గోదావరి జిల్లా కోరుకొండకు చెందిన రైవాడ మౌనిక అర్చన(19) తల్లి, అన్నయ్యతో కలిసి ఉంటుంది. తండ్రి గతంలోనే అనారోగ్యంతో మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం ఇంట్లో జరిగిన ఓ గొడవలో మౌనిక సెల్​ ఫోన్​ పగిలిపోయింది. అప్పటి నుంచి సెల్ ఫోన్ కొనివ్వాలని పట్టుబట్టింది. కొత్త ఫోన్​ కొనివ్వకపోవటంతో మనస్థాపానికి గురైన యువతి ... సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పంచనామా కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు.

తూర్పు గోదావరి జిల్లా కోరుకొండకు చెందిన రైవాడ మౌనిక అర్చన(19) తల్లి, అన్నయ్యతో కలిసి ఉంటుంది. తండ్రి గతంలోనే అనారోగ్యంతో మృతి చెందారు. కొన్ని రోజుల క్రితం ఇంట్లో జరిగిన ఓ గొడవలో మౌనిక సెల్​ ఫోన్​ పగిలిపోయింది. అప్పటి నుంచి సెల్ ఫోన్ కొనివ్వాలని పట్టుబట్టింది. కొత్త ఫోన్​ కొనివ్వకపోవటంతో మనస్థాపానికి గురైన యువతి ... సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పంచనామా కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు.

ఇదీ చదవండి : కాసేపట్లో వస్తానని... తిరిగి రాని లోకాలకు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.