ETV Bharat / state

'ఆందోళన వద్దు... అందరికీ రేషన్ ఇస్తాం' - కరోనాపై కన్నబాబు వ్యాఖ్యలు

రేషన్​ విషయంలో ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అందరికీ రేషన్ ఇస్తామని మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా ప్రతి పేద కుటుంబానికి వెయ్యి నగుదుతో పాటు కేజీ కందిపప్పు సక్రమంగా అందిస్తామన్నారు.

ఆందోళన వద్దు... అందరికి రేషన్ అందిస్తాం
ఆందోళన వద్దు... అందరికి రేషన్ అందిస్తాం
author img

By

Published : Mar 31, 2020, 5:37 PM IST

ఆందోళన వద్దు... అందరికి రేషన్ అందిస్తాం

కరోనా నేపథ్యంలో ప్రతి పేద కుంటుంబానికి వెయ్యి నగదుతోపాటు, కేజీ కందిపప్పు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. ఏప్రిల్ 1వ తేదీనే పింఛన్లు అందించేందుకు సమాయత్తమవుతున్నామన్నారు. రేషన్ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరికీ సరకులు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. పరిశ్రమలపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్​తో సమీక్ష నిర్వహించిన ఆయన...ప్రభుత్వ మద్దతు ధరకు ఎగుమతిదారులు రొయ్యలు కొనుగోలు చేయాలన్నారు. ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత అందిరిపైనా ఉందన్నారు. వాలంటీర్లు పని చేయటం లేదని ప్రతిపక్షాలు విమర్శించటం సరికాదన్నారు. ప్రాణాలను లెక్కచేయకుండా అధికారులతో కలిసి వారు విధులు నిర్వర్తిస్తున్నారన్నారు.

ఆందోళన వద్దు... అందరికి రేషన్ అందిస్తాం

కరోనా నేపథ్యంలో ప్రతి పేద కుంటుంబానికి వెయ్యి నగదుతోపాటు, కేజీ కందిపప్పు సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. ఏప్రిల్ 1వ తేదీనే పింఛన్లు అందించేందుకు సమాయత్తమవుతున్నామన్నారు. రేషన్ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రతి ఒక్కరికీ సరకులు అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. పరిశ్రమలపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్​తో సమీక్ష నిర్వహించిన ఆయన...ప్రభుత్వ మద్దతు ధరకు ఎగుమతిదారులు రొయ్యలు కొనుగోలు చేయాలన్నారు. ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత అందిరిపైనా ఉందన్నారు. వాలంటీర్లు పని చేయటం లేదని ప్రతిపక్షాలు విమర్శించటం సరికాదన్నారు. ప్రాణాలను లెక్కచేయకుండా అధికారులతో కలిసి వారు విధులు నిర్వర్తిస్తున్నారన్నారు.

ఇదీచదవండి

విదేశాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.