ETV Bharat / state

ఆక్సిజన్ అందక కరోనా రోగి మృతి.. బంధువుల ఆందోళన - man died with oxygen scarcity at amalapuram

కరోనా సోకిన వ్యక్తి సకాలంలో ఆక్సిజన్ అందక మృతిచెందిన ఘటన.. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జరిగింది. మృతుని బంధువులు అమలాపురంలోని శ్రీనిధి ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.

protest
protest
author img

By

Published : May 9, 2021, 3:53 PM IST

ఆక్సిజన్ అందక కరోనా రోగి మృతి చెందాడని.. అతని బంధువులు తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని కొవిడ్ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. అమలాపురంలోని శ్రీనిధి ఆసుపత్రిని కొవిడ్ ఆసుపత్రిగా అధికారులు గుర్తించారు.

అక్కడికి చికిత్స కోసం వెళ్లిన తమ బంధువు ఆక్సిజన్ అందక చనిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అయినవిల్లి మాజీ జడ్పీటీసీ సభ్యురాలు గంగుమల్ల కాశి అన్నపూర్ణ భర్త శ్రీనివాసరావు తదితరులు ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఆక్సిజన్ అందక కరోనా రోగి మృతి చెందాడని.. అతని బంధువులు తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని కొవిడ్ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. అమలాపురంలోని శ్రీనిధి ఆసుపత్రిని కొవిడ్ ఆసుపత్రిగా అధికారులు గుర్తించారు.

అక్కడికి చికిత్స కోసం వెళ్లిన తమ బంధువు ఆక్సిజన్ అందక చనిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అయినవిల్లి మాజీ జడ్పీటీసీ సభ్యురాలు గంగుమల్ల కాశి అన్నపూర్ణ భర్త శ్రీనివాసరావు తదితరులు ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రానికి చేరుకున్న మరో 3.6 లక్షల కరోనా డోసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.