ETV Bharat / state

ప్రమాదవశాత్తు గోదావరిలో పడి బాలుడు మృతి

author img

By

Published : Jan 17, 2021, 12:41 PM IST

తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలంలో గోదావరిలో ప్రమాదవశాత్తు పడిన ఓ బాలుడు మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

వివరాలు సేకరిస్తున్న పోలీసులు
వివరాలు సేకరిస్తున్న పోలీసులు

తూర్పు గోదావరి జిల్లా ఆలమూరులో మండలంలో విషాదం జరిగింది. జొన్నాడ గోదావరిలో స్నానానికి వచ్చి ఒక బాలుడు మృతి చెందాడు. గుమ్మిలేరు గ్రామానికి చెందిన బత్తిన ధనుష్ (13), తండ్రి, సోదరి, మరదలితో కలిసి జొన్నాడ వద్ద గోదావరి వంతెన వద్దకు వచ్చాడు.

కాసేపు సరదాగా గడిపిన తర్వాత ఇంటికి వెళ్దామనుకున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారి... ధనుష్ గోదావరిలో పడి గల్లంతయ్యాడు. కొద్దిసేపటికి మృతదేహం నీటిపై తేలియాడింది. ఆలమూరు ఎస్సై శివప్రసాద్ సంఘటనా ప్రాంతానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశాడు.

తూర్పు గోదావరి జిల్లా ఆలమూరులో మండలంలో విషాదం జరిగింది. జొన్నాడ గోదావరిలో స్నానానికి వచ్చి ఒక బాలుడు మృతి చెందాడు. గుమ్మిలేరు గ్రామానికి చెందిన బత్తిన ధనుష్ (13), తండ్రి, సోదరి, మరదలితో కలిసి జొన్నాడ వద్ద గోదావరి వంతెన వద్దకు వచ్చాడు.

కాసేపు సరదాగా గడిపిన తర్వాత ఇంటికి వెళ్దామనుకున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారి... ధనుష్ గోదావరిలో పడి గల్లంతయ్యాడు. కొద్దిసేపటికి మృతదేహం నీటిపై తేలియాడింది. ఆలమూరు ఎస్సై శివప్రసాద్ సంఘటనా ప్రాంతానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశాడు.

ఇదీ చదవండి:

పొద్దంతా కోడి పందేలు.. రాత్రంతా రికార్డింగ్ డాన్స్​లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.