ETV Bharat / state

రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్-19పై అవగాహన పూర్తి

author img

By

Published : Jan 20, 2021, 2:00 PM IST

కరోనా వైరస్ నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు 50 రోజుల పాటు చేపట్టిన అవగాహన కార్యక్రమాలు ముగిశాయి. ప్రభుత్వం ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్టు అధికారులు తెలిపారు.

Awareness programs on Kovid-19 completed across the state
రాష్ట్ర వ్యాప్తంగా ముగిసిన కోవిడ్-19పై అవగాహన కార్యక్రమాలు

అనంతపురం జిల్లాలో..

కదిరిలో అధికారులు, సిబ్బంది కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన రహదారుల్లో ర్యాలీ సాగింది. 'మాస్కులు ధరిద్ధాం మహమ్మారిని తరిమేద్దాం' అంటూ నినాదాలు చేస్తూ ప్రదర్శనలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

కర్నూలు జిల్లాలో..

కరోనా వైరస్​ను అరికట్టేందుకు చేపట్టిన నివారణ చర్యల్లో 'మాస్కే కవచం కార్యక్రమం' కర్నూలు జిల్లాలో ముగిసింది. డిసెంబర్ 1వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం 50 రోజులపాటు కొనసాగింది. చివరి రోజు కలెక్టర్ వీర పాండియన్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.

శ్రీకాకుళం జిల్లాలో..

నరసన్నపేటలో గత 50 రోజులుగా జరుగుతున్న కరోనా నివారణ అవగాహన కార్యక్రమాలు ముగిశాయి. ఎంపీడీఓ కార్యాలయం నుంచి కొత్త బస్టాండ్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది.

తూర్పుగోదావరి జిల్లాలో..

తూర్పుగోదావరి జిల్లాలో.. కోవిడ్-19 నివారణపై ప్రజలను జాగృతం చేసేందుకు 58 రోజులు పాటు అవగాహన కార్యక్రమాలు ముగియటంతో కొవ్వొత్తులతో ర్యాలీ ప్రదర్శన చేశారు. కరోనా వ్యాక్సిన్ జిల్లాలో ఇప్పటి వరకు 8వేల మందికి ఇచ్చినట్టు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

రాష్ట్రానికి చేరుకున్న మరో 4.08 లక్షల కొవిడ్ వ్యాక్సిన్లు

అనంతపురం జిల్లాలో..

కదిరిలో అధికారులు, సిబ్బంది కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన రహదారుల్లో ర్యాలీ సాగింది. 'మాస్కులు ధరిద్ధాం మహమ్మారిని తరిమేద్దాం' అంటూ నినాదాలు చేస్తూ ప్రదర్శనలో వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

కర్నూలు జిల్లాలో..

కరోనా వైరస్​ను అరికట్టేందుకు చేపట్టిన నివారణ చర్యల్లో 'మాస్కే కవచం కార్యక్రమం' కర్నూలు జిల్లాలో ముగిసింది. డిసెంబర్ 1వ తేదీన ప్రారంభమైన ఈ కార్యక్రమం 50 రోజులపాటు కొనసాగింది. చివరి రోజు కలెక్టర్ వీర పాండియన్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.

శ్రీకాకుళం జిల్లాలో..

నరసన్నపేటలో గత 50 రోజులుగా జరుగుతున్న కరోనా నివారణ అవగాహన కార్యక్రమాలు ముగిశాయి. ఎంపీడీఓ కార్యాలయం నుంచి కొత్త బస్టాండ్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది.

తూర్పుగోదావరి జిల్లాలో..

తూర్పుగోదావరి జిల్లాలో.. కోవిడ్-19 నివారణపై ప్రజలను జాగృతం చేసేందుకు 58 రోజులు పాటు అవగాహన కార్యక్రమాలు ముగియటంతో కొవ్వొత్తులతో ర్యాలీ ప్రదర్శన చేశారు. కరోనా వ్యాక్సిన్ జిల్లాలో ఇప్పటి వరకు 8వేల మందికి ఇచ్చినట్టు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

రాష్ట్రానికి చేరుకున్న మరో 4.08 లక్షల కొవిడ్ వ్యాక్సిన్లు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.