ETV Bharat / state

ఓ వైపు భర్త కర్మక్రియలు.. మరోవైపు భార్య అరెస్ట్​..ఎందుకంటే..!

author img

By

Published : Jul 30, 2021, 12:38 PM IST

వివాహేతర సంబంధం కారణంగా.. ఓ వివాహిత కట్టుకున్న భర్తను ఉరేసి చంపేసింది. గుండెపోటుతో మరణించాడని బంధువులను నమ్మించే ప్రయత్నం చేసింది. సొంత కొడుకు ఆమెను నమ్మక పోలీసులు ఫిర్యాదు చేేశాడు. చివరకు తన భర్త కర్మక్రియలు జరుగుతుండగానే పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా అరిగిలవారిపల్లిలో జరిగింది

wife   killed her husband at arigalavaripalli
అరిగిలవారిపల్లిలో భర్తను చంపిన భార్య

ఓ వైపు భర్త కర్మక్రియలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈలోగా అక్కడకు చేరుకున్న పోలీసులు భార్యను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఏం జరుగుతుందోనన్న టెన్షన్​లో ఉన్నారు. తీరా విషయం తెలుసుకుని..ఆమె ఇంతా ఘోరం చేసిందా అని అవాక్కైన ఘటన చిత్తూరు జిల్లా అరిగిలవారిపల్లిలో జరిగింది.

పనపాకం పంచాయతీ అరిగిలవారిపల్లికి చెందిన వాసు (46) చిత్తూరు కలెక్టర్‌ కార్యాలయంలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తూ శ్రీనగర్‌ కాలనీలో భార్య స్వప్నప్రియ, కుమారుడు వినయ్‌తో కలిసి ఉంటున్నాడు. చిత్తూరుకు చెందిన ఓ యువకునితో స్వప్నప్రియ చనువుగా ఉండటాన్ని గుర్తించిన భర్త వాసు పలుమార్లు మందలించాడు. ఈనెల 19వ తేదీన భార్య, భర్త మరోసారి గొడవ పడగా అప్పటికే మద్యం మత్తులో ఉన్న భర్త వాసును స్వప్నప్రియ కిందపడేసి గొంతుకు ఉరివేసి చంపింది. తన భర్త గుండెపోటుతో మృతి చెందినట్లు అత్త తరఫు బంధువులకు చరవాణిలో సమాచారం ఇచ్చింది.

ఎవ్వరికీ అనుమానం రాకుండా గొంతు భాగంలో గాయాలను కప్పిపెట్టి మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చింది. తన తల్లిపై అనుమానంతో కుమారుడు వినయ్‌ తండ్రి మృతదేహాన్ని నిశితంగా గమనించగా.. గొంతుపై గాయాలు కనిపించాయి. దీంతో మృతుని తల్లి వసంతమ్మతో కలిసి చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించిన చంద్రగిరి పోలీసులు.. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందినట్లు కేసు నమోదు చేసి చిత్తూరు రెండో పట్టణ పోలీసులకు బదలాయించారు. దీనిపై విచారణ చేపట్టిన చిత్తూరు పోలీసులు హత్యగా నిర్ధరించుకుని గురువారం అరిగిలవారిపల్లిలో మృతుని ఇంట కర్మక్రియలు జరుగుతుండగా స్వప్నప్రియను అదుపులోకి తీసుకున్నారు. తండ్రి మరణించటం, కన్నతల్లి కటకటాల పాలవటంతో బాలుడు వినయ్‌ కన్నీటి పర్యంతమై తన తండ్రి చిత్రపటం ముందు బోరున విలపించటం అక్కడివారిచే కన్నీరు పెట్టించింది.

ఓ వైపు భర్త కర్మక్రియలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈలోగా అక్కడకు చేరుకున్న పోలీసులు భార్యను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఏం జరుగుతుందోనన్న టెన్షన్​లో ఉన్నారు. తీరా విషయం తెలుసుకుని..ఆమె ఇంతా ఘోరం చేసిందా అని అవాక్కైన ఘటన చిత్తూరు జిల్లా అరిగిలవారిపల్లిలో జరిగింది.

పనపాకం పంచాయతీ అరిగిలవారిపల్లికి చెందిన వాసు (46) చిత్తూరు కలెక్టర్‌ కార్యాలయంలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తూ శ్రీనగర్‌ కాలనీలో భార్య స్వప్నప్రియ, కుమారుడు వినయ్‌తో కలిసి ఉంటున్నాడు. చిత్తూరుకు చెందిన ఓ యువకునితో స్వప్నప్రియ చనువుగా ఉండటాన్ని గుర్తించిన భర్త వాసు పలుమార్లు మందలించాడు. ఈనెల 19వ తేదీన భార్య, భర్త మరోసారి గొడవ పడగా అప్పటికే మద్యం మత్తులో ఉన్న భర్త వాసును స్వప్నప్రియ కిందపడేసి గొంతుకు ఉరివేసి చంపింది. తన భర్త గుండెపోటుతో మృతి చెందినట్లు అత్త తరఫు బంధువులకు చరవాణిలో సమాచారం ఇచ్చింది.

ఎవ్వరికీ అనుమానం రాకుండా గొంతు భాగంలో గాయాలను కప్పిపెట్టి మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చింది. తన తల్లిపై అనుమానంతో కుమారుడు వినయ్‌ తండ్రి మృతదేహాన్ని నిశితంగా గమనించగా.. గొంతుపై గాయాలు కనిపించాయి. దీంతో మృతుని తల్లి వసంతమ్మతో కలిసి చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించిన చంద్రగిరి పోలీసులు.. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందినట్లు కేసు నమోదు చేసి చిత్తూరు రెండో పట్టణ పోలీసులకు బదలాయించారు. దీనిపై విచారణ చేపట్టిన చిత్తూరు పోలీసులు హత్యగా నిర్ధరించుకుని గురువారం అరిగిలవారిపల్లిలో మృతుని ఇంట కర్మక్రియలు జరుగుతుండగా స్వప్నప్రియను అదుపులోకి తీసుకున్నారు. తండ్రి మరణించటం, కన్నతల్లి కటకటాల పాలవటంతో బాలుడు వినయ్‌ కన్నీటి పర్యంతమై తన తండ్రి చిత్రపటం ముందు బోరున విలపించటం అక్కడివారిచే కన్నీరు పెట్టించింది.

ఇదీ చూడండి.

current shock: గుంటూరు జిల్లాలో ఆరుగురు అనుమానాస్పద మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.