ETV Bharat / state

ఇళ్లలోకి నీళ్లు.. నిరసనకు దిగిన వరద బాధితులు

author img

By

Published : Oct 11, 2020, 8:06 PM IST

ఇళ్లలోకి వరద చేరటంతో ప్రజలు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. చెరువు నిండి ఇళ్లలోకి నీరు వచ్చి చేరిందని... అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Villagers protest a
కల్లూరు గ్రామస్తుల నిరసన

చెరువు నిండి ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో గ్రామస్థులు నిరసన చేపట్టారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలోని కల్లూరు దిగివీధి గ్రామంలో ఈ ఘటన జరిగింది. సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించకపోవటంపై నిరసనకు దిగారు.

జాతీయ రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కల్లూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అధికారుల దృష్టికి... తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి నిరసనను విరమింపజేశారు.

చెరువు నిండి ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో గ్రామస్థులు నిరసన చేపట్టారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలోని కల్లూరు దిగివీధి గ్రామంలో ఈ ఘటన జరిగింది. సమస్యను ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కరించకపోవటంపై నిరసనకు దిగారు.

జాతీయ రహదారిపై బైఠాయించి నినాదాలు చేశారు. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కల్లూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అధికారుల దృష్టికి... తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి నిరసనను విరమింపజేశారు.

ఇదీ చదవండి:

సొంతింటి కల... సగంలోనే నిలిచింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.