ETV Bharat / state

సామాన్య భక్తుడిలా శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి - తితిదే వార్తలు

తిరుమల శ్రీవారిని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు దర్శించుకున్నారు. సామాన్య భక్తుడిలా వైకుంఠద్వారం ద్వారా కుటుంబసభ్యులతో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందజేశారు.

Vice President Venkaiah Naidu visits   tirumala
సామాన్య భక్తుడిలా శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి
author img

By

Published : Mar 5, 2021, 8:41 AM IST

సామాన్య భక్తుడిలా శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి

తిరుమల శ్రీవారి సేవలో ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు. సామాన్య భక్తుడిలా వైకుంఠద్వారం ద్వారా స్వామి దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం అర్చకులు తీర్థ శఠారితో ఆశీర్వదించారు. రంగనాయకుల మండపంలో వెంకయ్యనాయుడు దంపతులకు పండితులు వేదాశీర్వచనం చేయగా... ఈవో జ‌వ‌హ‌ర్‌రెడ్డి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. దేశ ప్రజల ఆరోగ్యం, సుఖ శాంతుల కోసం స్వామి వారిని ప్రార్థించానని ఉపరాష్ట్రపతి తెలియజేశారు.

ఇదీ చూడండి. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

సామాన్య భక్తుడిలా శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి

తిరుమల శ్రీవారి సేవలో ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కుటుంబసభ్యులతో కలిసి పాల్గొన్నారు. సామాన్య భక్తుడిలా వైకుంఠద్వారం ద్వారా స్వామి దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం అర్చకులు తీర్థ శఠారితో ఆశీర్వదించారు. రంగనాయకుల మండపంలో వెంకయ్యనాయుడు దంపతులకు పండితులు వేదాశీర్వచనం చేయగా... ఈవో జ‌వ‌హ‌ర్‌రెడ్డి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. దేశ ప్రజల ఆరోగ్యం, సుఖ శాంతుల కోసం స్వామి వారిని ప్రార్థించానని ఉపరాష్ట్రపతి తెలియజేశారు.

ఇదీ చూడండి. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.