ETV Bharat / state

govindaraja swamy temple:'బంగారు తాపడం పనులను మే నాటికి పూర్తి చేస్తాం'

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయాన్ని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సందర్శించారు. ఆలయంలోని విమాన గోపురానికి బంగారు తాపడం పనులను వచ్చే ఏడాది మే నాటికి పూర్తి చేస్తామన్నారు. పనులు పూర్తయ్యే వరకు భక్తులకు మూలమూర్తి దర్శనం యథావిధిగా ఉంటుందన్నారు.

author img

By

Published : Sep 13, 2021, 8:37 PM IST

YV Subbareddy
వైవీ సుబ్బారెడ్డి

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో విమాన గోపురానికి బంగారు తాపడం పనులు.. వచ్చే ఏడాది మే నెల నాటికి పూర్తి చేస్తామని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆలయంలోని విమాన గోపురాన్ని తితిదే ఈవో జవహర్ రెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. ఆలయంలో ఐదు రోజులుగా జరుగుతున్న బాలాలయ కార్యక్రమాలు సంప్రోక్షణతో ఇవాళ ముగిశాయి.

ఆలయ గోపురానికి బంగారు తాపడం పనులు చేపట్టాలని 2018వ సంవత్సరంలో తితిదే బోర్డు నిర్ణయం తీసుకుందని... రూ.32 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 100 కిలోల బంగారం, 4,300 కిలోల రాగి వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పనులు పూర్తయ్యే వరకు భక్తులకు మూలమూర్తి దర్శనం యథావిధిగా ఉంటుందని.. కైంకర్యాలన్నీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన బాలాలయంలో నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో విమాన గోపురానికి బంగారు తాపడం పనులు.. వచ్చే ఏడాది మే నెల నాటికి పూర్తి చేస్తామని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆలయంలోని విమాన గోపురాన్ని తితిదే ఈవో జవహర్ రెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. ఆలయంలో ఐదు రోజులుగా జరుగుతున్న బాలాలయ కార్యక్రమాలు సంప్రోక్షణతో ఇవాళ ముగిశాయి.

ఆలయ గోపురానికి బంగారు తాపడం పనులు చేపట్టాలని 2018వ సంవత్సరంలో తితిదే బోర్డు నిర్ణయం తీసుకుందని... రూ.32 కోట్ల వ్యయంతో ఈ పనులు చేపట్టామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 100 కిలోల బంగారం, 4,300 కిలోల రాగి వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పనులు పూర్తయ్యే వరకు భక్తులకు మూలమూర్తి దర్శనం యథావిధిగా ఉంటుందని.. కైంకర్యాలన్నీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన బాలాలయంలో నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ఇదీ చదవండి

TTD: త్వరలోనే ఆన్‌లైన్‌లో సర్వదర్శన టోకెన్లు: తితిదే ఛైర్మన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.