ETV Bharat / state

ఇప్పటికీ అంధకారంలోనే గిరిజనులు: సీపీఐ నేత హరినాథరెడ్డి

author img

By

Published : Jun 20, 2020, 10:07 AM IST

చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలోని గిరిజన గ్రామాల్లో సీపీఐ నేత హరినాథరెడ్డి పర్యటించారు. స్వాతంత్య్రం వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇంకా గిరిజనులు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే వారి సమస్యలను తీర్చి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Tribals are still in the dark Said  CPI Secretary of State Harinath Reddy in ramachandrapuram chitthore district
గ్రామస్థుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న సీపీఐ నేత హరినాథరెడ్డి

స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా.. గిరిజనులు ఇప్పటికీ అంధకారంలోనే ఉన్నారని సీపీఐ నాయకుడు హరినాథరెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లాలోని రామచంద్రాపురం మండలంలో పర్యటించిన ఆయన.. ప్రభుత్వ పథకాలకు గిరిజనులు అర్హులు కారా అని ప్రశ్నించారు. ఓట్లు వేసేందుకు అవసరమొచ్చే గిరిజనులు.. ప్రభుత్వ పథకాల అమలుకు పనికిరారా అని మండిపడ్డారు.

తిరుపతి నగరానికి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న గిరిజనులు.. నేటికీ ఎలాంటి వసతులు లేక దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లాక్​డౌన్ సమయంలోనూ వారికి ఉచిత బియ్యం ఇవ్వకుండా కడుపులు కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటరు కార్డు ఆధారంగా ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు, ఆధార్ కార్డులు మంజూరు చేసి పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు డిమాండ్ చేశారు.

స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా.. గిరిజనులు ఇప్పటికీ అంధకారంలోనే ఉన్నారని సీపీఐ నాయకుడు హరినాథరెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లాలోని రామచంద్రాపురం మండలంలో పర్యటించిన ఆయన.. ప్రభుత్వ పథకాలకు గిరిజనులు అర్హులు కారా అని ప్రశ్నించారు. ఓట్లు వేసేందుకు అవసరమొచ్చే గిరిజనులు.. ప్రభుత్వ పథకాల అమలుకు పనికిరారా అని మండిపడ్డారు.

తిరుపతి నగరానికి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న గిరిజనులు.. నేటికీ ఎలాంటి వసతులు లేక దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లాక్​డౌన్ సమయంలోనూ వారికి ఉచిత బియ్యం ఇవ్వకుండా కడుపులు కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటరు కార్డు ఆధారంగా ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు, ఆధార్ కార్డులు మంజూరు చేసి పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

తెలంగాణ: కుక్కల దాడిలో 33 గొర్రెలు మృత్యువాత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.