ETV Bharat / state

Tirumala: శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల.. 80 నిమిషాల్లోనే ఖాళీ!

TTD Tickets: ఈరోజు ఉదయం 9 గంటలకు జనవరి నెలకు సంబంధించిన శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తితిదే విడుదల చేసింది.

author img

By

Published : Dec 24, 2021, 7:42 AM IST

Updated : Dec 24, 2021, 12:21 PM IST

tirumala srivari  special darshan tickets released today
శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్ల విడుదల.. 80 నిమిషాల్లోనే ఖాళీ!

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తితిదే ఆన్‌లైన్​లో విడుదల చేసింది. 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లను అందుబాటులో ఉంచింది. జనవరి నెలకు సంబంధించి నాలుగు లక్షల 60 వేల టికెట్లను విడుదల చేశారు. వర్చువల్‌ క్యూ, ఓటీపీల ద్వారా టికెట్లను కేటాయించారు. జనవరిలో వైకుంఠ ఏకాదశి ఉండడంతో అధిక సంఖ్యలో భక్తులు టికెట్ల కోసం ప్రయత్నించగా.. 80నిమిషాల్లోనే ఖాళీ అయ్యాయి. సర్వదర్శనం టికెట్లను ఈ నెల 31వ తేదీ నుంచి కరెంట్‌ బుకింగ్‌ ద్వారా కేటాయించాలని తితిదే భావిస్తోంది.

శ్రీవారి భక్తుల సౌకర్యార్థం జనవరి నెలకు సంబంధించి 1, 2 తేదీలు, 13 నుంచి 22 వరకు, 26వ తేదీల్లో 5,500 వర్చువల్‌ సేవా దర్శన టికెట్లను తితిదే విడుదల చేసింది. శుక్రవారం ఉదయం 9 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జనవరి 1, 13 నుంచి 22వ తేదీ వరకు.. రోజుకు 20 వేలు చొప్పున.. జనవరి 2 నుంచి 12, 23 నుంచి 31 వరకు.. రోజుకు 12 వేల చొప్పున ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. తిరుమలలో వసతి గదుల సమాచారాన్ని ఈ నెల 27న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో ప్రకటించనున్నట్లు తితిదే వెల్లడించింది. జనవరి 11 నుంచి 14 వరకు వసతిని తిరుమలలోనే కరెంట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చని తెలిపింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందుగానే దర్శన, వసతిని టికెట్లను బుక్‌ చేసుకోవాలని భక్తులు తితిదే సూచించింది.

వర్చువల్ సేవా టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అవకాశం కల్పిస్తుంది. ఈ మేరకు వర్చువల్‌ టికెట్లు బుక్‌ చేసుకుంటున్న సమయంలోనే స్వామివారి దర్శన సమయాన్ని వర్చువల్‌ టికెట్లలో పొందుపరుస్తోంది. ఈ మేరకు కేటాయించిన సమయానికి భక్తులు స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది.

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తితిదే ఆన్‌లైన్​లో విడుదల చేసింది. 300 రూపాయల ప్రత్యేక దర్శన టికెట్లను అందుబాటులో ఉంచింది. జనవరి నెలకు సంబంధించి నాలుగు లక్షల 60 వేల టికెట్లను విడుదల చేశారు. వర్చువల్‌ క్యూ, ఓటీపీల ద్వారా టికెట్లను కేటాయించారు. జనవరిలో వైకుంఠ ఏకాదశి ఉండడంతో అధిక సంఖ్యలో భక్తులు టికెట్ల కోసం ప్రయత్నించగా.. 80నిమిషాల్లోనే ఖాళీ అయ్యాయి. సర్వదర్శనం టికెట్లను ఈ నెల 31వ తేదీ నుంచి కరెంట్‌ బుకింగ్‌ ద్వారా కేటాయించాలని తితిదే భావిస్తోంది.

శ్రీవారి భక్తుల సౌకర్యార్థం జనవరి నెలకు సంబంధించి 1, 2 తేదీలు, 13 నుంచి 22 వరకు, 26వ తేదీల్లో 5,500 వర్చువల్‌ సేవా దర్శన టికెట్లను తితిదే విడుదల చేసింది. శుక్రవారం ఉదయం 9 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను జనవరి 1, 13 నుంచి 22వ తేదీ వరకు.. రోజుకు 20 వేలు చొప్పున.. జనవరి 2 నుంచి 12, 23 నుంచి 31 వరకు.. రోజుకు 12 వేల చొప్పున ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. తిరుమలలో వసతి గదుల సమాచారాన్ని ఈ నెల 27న ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో ప్రకటించనున్నట్లు తితిదే వెల్లడించింది. జనవరి 11 నుంచి 14 వరకు వసతిని తిరుమలలోనే కరెంట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చని తెలిపింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందుగానే దర్శన, వసతిని టికెట్లను బుక్‌ చేసుకోవాలని భక్తులు తితిదే సూచించింది.

వర్చువల్ సేవా టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అవకాశం కల్పిస్తుంది. ఈ మేరకు వర్చువల్‌ టికెట్లు బుక్‌ చేసుకుంటున్న సమయంలోనే స్వామివారి దర్శన సమయాన్ని వర్చువల్‌ టికెట్లలో పొందుపరుస్తోంది. ఈ మేరకు కేటాయించిన సమయానికి భక్తులు స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి:

CM Jagan Kadapa Tour: త్వరలో సీమ రూపురేఖలు మారిపోతాయి: సీఎం జగన్

Last Updated : Dec 24, 2021, 12:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.