ETV Bharat / state

లారీని ఢీకొన్న ద్విచక్రవాహనం.. ముగ్గురు మృతి

author img

By

Published : Feb 12, 2021, 9:54 PM IST

ఎదురుగా వస్తున్న లారీని ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. చిత్తూరు జిల్లా మదనపల్లె శివారు ఆరోగ్యవరం రహదారి మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. మృతులు స్థానిక నీరుగొట్టుపల్లెలోని మాయాబజార్ కాలనీకి చెందిన యువకులుగా పోలీసులు భావిస్తున్నారు.

three persons dead in bike accident at arogyavaram
ఆరోగ్యవరం వద్ద రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

చిత్తూరు జిల్లా మదనపల్లె శివారు ఆరోగ్యవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు మరణించారు. మృతులను స్థానిక నీరుగొట్టుపల్లెలోని మాయాబజార్ కాలనీకి చెందిన వ్యక్తులుగా భావిస్తున్నారు. వారిలో ఇద్దరిని ధనుష్, మనోజ్​గా గుర్తించారు. గుర్రంకొండ మండలం తరిగొండ వద్ద వివాహానికి హాజరవ్వడానికి వెళ్తూ.. బాధితులు ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. ఆరోగ్యవరం సమీపంలోని రహదారి మలుపు వద్ద.. ఎదురుగా వస్తున్న లారీని ద్విచక్రవాహనంతో వేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.

ఇదీ చదవండి:

చిత్తూరు జిల్లా మదనపల్లె శివారు ఆరోగ్యవరం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు యువకులు మరణించారు. మృతులను స్థానిక నీరుగొట్టుపల్లెలోని మాయాబజార్ కాలనీకి చెందిన వ్యక్తులుగా భావిస్తున్నారు. వారిలో ఇద్దరిని ధనుష్, మనోజ్​గా గుర్తించారు. గుర్రంకొండ మండలం తరిగొండ వద్ద వివాహానికి హాజరవ్వడానికి వెళ్తూ.. బాధితులు ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. ఆరోగ్యవరం సమీపంలోని రహదారి మలుపు వద్ద.. ఎదురుగా వస్తున్న లారీని ద్విచక్రవాహనంతో వేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.

ఇదీ చదవండి:

పెద్దిరెడ్డి నియోజకవర్గంలో అన్ని పంచాయతీలు ఏకగ్రీవం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.