ETV Bharat / state

అశ్రునయనాల మధ్య శివప్రసాద్​ అంత్యక్రియలు

తెలుగుదేశం సీనియర్‌ నేత, మాజీ ఎంపీ శివప్రసాద్‌ అంత్యక్రియలు ముగిశాయి. చంద్రగిరి సమీపంలోని అగరాలలో తెదేపా కార్యకర్తలు, అభిమానులు కన్నీటి మధ్య శివప్రసాద్​కు వీడ్కోలు పలికారు.

author img

By

Published : Sep 22, 2019, 8:42 PM IST

శివప్రసాద్
విలక్షణ నేతకు తుది వీడ్కోలు

అనారోగ్యంతో కన్నుమూసిన తెలుగుదేశం సీనియర్‌ నేత, మాజీ ఎంపీ శివప్రసాద్‌ అంత్యక్రియలు అభిమానుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. చంద్రగిరి సమీపంలోని అగరాల వరకూ సాగిన అంతిమయాత్రలో అభిమానులు, పార్టీ శ్రేణులు పొల్గొన్నారు. శివప్రసాద్ అందరితో సాన్నిహిత్యంగా మెలుగుతూ పార్టీలకతీతంగా అందరివాడిగా మన్ననలు పొందారని రాజకీయ, సినీ ప్రముఖులు గుర్తు చేసుకున్నారు.

అంతకుముందు శివప్రసాద్ పార్థివదేహానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. అభిమానులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భారీసంఖ్యలో తరలివచ్చి తిరుపతి ఎన్​జీవో కాలనీలోని స్వగృహంలో శివప్రసాద్ భౌతికకాయాన్ని సందర్శించారు.

స్నేహితుడ్ని కోల్పోయా
శివప్రసాద్ పార్థివదేహానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఎంపీ గల్లా జయదేవ్, గల్లా అరుణకుమారి, అమర్‌నాథ్‌ రెడ్డి నివాళులు అర్పించారు. శివప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. అంతిమయాత్రలోనూ పాల్గొన్న చంద్రబాబు బాల్య స్నేహితుడితో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. శివప్రసాద్ రాష్ట్ర సమస్యలను విభిన్నశైలిలో దిల్లీ స్థాయిలో వినిపించారని గుర్తు చేసుకున్నారు.

శివప్రసాద్ విగ్రహం ఏర్పాటు చేస్తాం
శివప్రసాద్ భౌతికకాయానికి వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, తెరాస ఎంపీ నామా నాగేశ్వరరావు నివాళులు అర్పించారు. శివప్రసాద్‌తో తనకు చిన్ననాటి నుంచి గుర్తుంచుకోదగిన ఙ్ఞాపకాలు ఉన్నాయని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. శివప్రసాద్ స్వగ్రామంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు చెవిరెడ్డి ప్రకటించారు. శివప్రసాద్ వ్యక్తిగతంగా తనకు అన్నలాంటి వారన్న ఆయన పార్టీలకతీతంగా అందరితో కలిసిమెలసి ఉండేవారని గుర్తు చేసుకున్నారు. శివప్రసాద్ ఙ్ఞాపకాలు చిరకాలం గుర్తుండేలా స్మారకం ఏర్పాటు చేస్తామని అన్నారు.

అణగారిన వర్గాల అభ్యున్నతికి శ్రమించిన నేతను కళ్లారా చూసుకునేందుకు కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. తిరుపతి ఎన్​జీవో కాలనీ నుంచి చంద్రగిరి సమీపంలోని అగరాల వరకూ జరిగిన అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. అనంతరం సంప్రదాయ రీతిలో శివప్రసాద్‌ భౌతిక కాయాన్ని ఖననం చేశారు.

ఇవీ చదవండి

శివప్రసాద్​పై చంద్రబాబు భావోద్వేగ ట్వీట్

విభిన్నం... విలక్షణం... ఎప్పుడూ ప్రజాపక్షం...

విలక్షణ నేతకు తుది వీడ్కోలు

అనారోగ్యంతో కన్నుమూసిన తెలుగుదేశం సీనియర్‌ నేత, మాజీ ఎంపీ శివప్రసాద్‌ అంత్యక్రియలు అభిమానుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. చంద్రగిరి సమీపంలోని అగరాల వరకూ సాగిన అంతిమయాత్రలో అభిమానులు, పార్టీ శ్రేణులు పొల్గొన్నారు. శివప్రసాద్ అందరితో సాన్నిహిత్యంగా మెలుగుతూ పార్టీలకతీతంగా అందరివాడిగా మన్ననలు పొందారని రాజకీయ, సినీ ప్రముఖులు గుర్తు చేసుకున్నారు.

అంతకుముందు శివప్రసాద్ పార్థివదేహానికి సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. అభిమానులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భారీసంఖ్యలో తరలివచ్చి తిరుపతి ఎన్​జీవో కాలనీలోని స్వగృహంలో శివప్రసాద్ భౌతికకాయాన్ని సందర్శించారు.

స్నేహితుడ్ని కోల్పోయా
శివప్రసాద్ పార్థివదేహానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఎంపీ గల్లా జయదేవ్, గల్లా అరుణకుమారి, అమర్‌నాథ్‌ రెడ్డి నివాళులు అర్పించారు. శివప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. అంతిమయాత్రలోనూ పాల్గొన్న చంద్రబాబు బాల్య స్నేహితుడితో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. శివప్రసాద్ రాష్ట్ర సమస్యలను విభిన్నశైలిలో దిల్లీ స్థాయిలో వినిపించారని గుర్తు చేసుకున్నారు.

శివప్రసాద్ విగ్రహం ఏర్పాటు చేస్తాం
శివప్రసాద్ భౌతికకాయానికి వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, తెరాస ఎంపీ నామా నాగేశ్వరరావు నివాళులు అర్పించారు. శివప్రసాద్‌తో తనకు చిన్ననాటి నుంచి గుర్తుంచుకోదగిన ఙ్ఞాపకాలు ఉన్నాయని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. శివప్రసాద్ స్వగ్రామంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు చెవిరెడ్డి ప్రకటించారు. శివప్రసాద్ వ్యక్తిగతంగా తనకు అన్నలాంటి వారన్న ఆయన పార్టీలకతీతంగా అందరితో కలిసిమెలసి ఉండేవారని గుర్తు చేసుకున్నారు. శివప్రసాద్ ఙ్ఞాపకాలు చిరకాలం గుర్తుండేలా స్మారకం ఏర్పాటు చేస్తామని అన్నారు.

అణగారిన వర్గాల అభ్యున్నతికి శ్రమించిన నేతను కళ్లారా చూసుకునేందుకు కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. తిరుపతి ఎన్​జీవో కాలనీ నుంచి చంద్రగిరి సమీపంలోని అగరాల వరకూ జరిగిన అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. అనంతరం సంప్రదాయ రీతిలో శివప్రసాద్‌ భౌతిక కాయాన్ని ఖననం చేశారు.

ఇవీ చదవండి

శివప్రసాద్​పై చంద్రబాబు భావోద్వేగ ట్వీట్

విభిన్నం... విలక్షణం... ఎప్పుడూ ప్రజాపక్షం...

Intro:AP_Tpt_32_06_uoogadhi_avb_c4 శ్రీకాళహస్తిలో ఘనంగా ఉగాది వేడుకలు.


Body:తెలుగు సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా శ్రీ కాళహస్తీశ్వరాలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. ఉదయం నుంచి భక్తులకు ఉగాది పచ్చడిని అందజేశారు. ఆలయ ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ పంచాంగ శ్రవణం చేపట్టారు. ఈ ఏడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చరిష్మా చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గుతుందని, అధికారి వియోగం ఉందని తెలిపారు. రహర్యానాలో భాజపాకు నా మాత్రం ఫలితాలు చేకూరి గా తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్ ,పంజాబ్లో బీజేపీకి శూన్య ఫలితాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. అదేవిధంగా రాశి ఫలితాలు వివరించారు.


Conclusion:శ్రీకాళహస్తిలో లో ఉగాది వేడుకలు ,పంచాంగ శ్రవణం , ఈటీవీ భారత్, శ్రీకాళహస్తి, సి.వెంకటరత్నం. 8008574559.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.