ETV Bharat / state

space tour: తొలిసారిగా అంతరిక్షంలోకి తెలుగు మూలాలు ఉన్న మహిళ - తెలుగ మహిళ శిరీష బండ్ల స్పేస్ టూర్

The first woman with Telugu roots going into space
The first woman with Telugu roots going into space
author img

By

Published : Jul 2, 2021, 9:26 AM IST

Updated : Jul 2, 2021, 12:54 PM IST

09:25 July 02

ఈ నెల 11న అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్న శిరీష బండ్ల

తొలిసారిగా అంతరిక్షంలోకి తెలుగు మూలాలు ఉన్న మహిళ

 అంతరిక్షయానంలో తొలిసారిగా ఓ తెలుగు పేరు చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఈనెల 11న తమ అంతరిక్ష వాహక నౌక "యూనిటీ -22" ను ప్రయోగించనున్నట్లు ప్రముఖ ప్రైవేట్అంతరిక్షయాన సంస్థ వర్జిన్ గెలాక్టిక్ ప్రకటించింది. ఆ సంస్థ అధిపతి సర్ రిచర్డ్ బ్రోన్సన్​తో పాటు మరో ముగ్గురు అంతరిక్షంలో ప్రయాణించనున్నట్లు ప్రకటన చేసింది. ఈ బృందంలో తెలుగు మూలాలు ఉన్న శిరీష బండ్ల.. వర్జిన్ గెలాక్టిక్ ఉపాధ్యక్షురాలి హోదాలో అంతరిక్ష ప్రయాణం చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు.  ఈ ఘనతను అందుకున్న తొలి తెలుగు మూలాలున్న మహిళగా శిరీష చరిత్ర సృష్టించనున్నారు.

 ఆంధ్రప్రదేశ్​కు చెందిన శిరీష కుటుంబం.. వాషింగ్టన్​లో స్థిరపడ్డారు. అక్కడే ఏరోస్పేస్ అండ్ ఆస్ట్రో నాటికల్ ఇంజనీరింగ్​లో శిరీష పట్టభద్రురాలు అయ్యారు. జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసిన అనంతరం.. 2015 నుంచి వర్జిన్ గెలాక్టిక్​లో పలు కీలక బాధ్యతలను శిరీష నిర్వహిస్తున్నారు.  

 అంతరిక్ష ప్రయాణంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం, అంతరిక్ష పర్యాటకంలో తమ ప్రస్థానాన్ని ప్రారంభించేందుకు.. బ్లూ ఆర్జిన్ సంస్థ ద్వారా అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ ఈనెల 20న అంతరిక్ష ప్రయాణం చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఆ సంస్థకు పోటీగా వర్జిన్ గెలాక్టిక్ చేసిన ఈ ప్రకటన.. అందులో తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి భాగస్వామ్యం కావడం.. సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నెల 11న "యూనిటీ -22" వాహక నౌక అంతరిక్ష ప్రయాణానికి సన్నద్ధమవుతోంది. అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రయోగం చేస్తున్నట్లు వర్జిన్ గెలాక్టిక్​ తెలిపింది. వర్జిన్ గెలాక్టిక్ అందుకు కావలసిన అనుమతులను పొందింది.

ఇదీ చదవండి: 

'సార్వత్రిక ఉచిత వైద్యవ్యవస్థే ఉత్తమం'

09:25 July 02

ఈ నెల 11న అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్న శిరీష బండ్ల

తొలిసారిగా అంతరిక్షంలోకి తెలుగు మూలాలు ఉన్న మహిళ

 అంతరిక్షయానంలో తొలిసారిగా ఓ తెలుగు పేరు చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఈనెల 11న తమ అంతరిక్ష వాహక నౌక "యూనిటీ -22" ను ప్రయోగించనున్నట్లు ప్రముఖ ప్రైవేట్అంతరిక్షయాన సంస్థ వర్జిన్ గెలాక్టిక్ ప్రకటించింది. ఆ సంస్థ అధిపతి సర్ రిచర్డ్ బ్రోన్సన్​తో పాటు మరో ముగ్గురు అంతరిక్షంలో ప్రయాణించనున్నట్లు ప్రకటన చేసింది. ఈ బృందంలో తెలుగు మూలాలు ఉన్న శిరీష బండ్ల.. వర్జిన్ గెలాక్టిక్ ఉపాధ్యక్షురాలి హోదాలో అంతరిక్ష ప్రయాణం చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు.  ఈ ఘనతను అందుకున్న తొలి తెలుగు మూలాలున్న మహిళగా శిరీష చరిత్ర సృష్టించనున్నారు.

 ఆంధ్రప్రదేశ్​కు చెందిన శిరీష కుటుంబం.. వాషింగ్టన్​లో స్థిరపడ్డారు. అక్కడే ఏరోస్పేస్ అండ్ ఆస్ట్రో నాటికల్ ఇంజనీరింగ్​లో శిరీష పట్టభద్రురాలు అయ్యారు. జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసిన అనంతరం.. 2015 నుంచి వర్జిన్ గెలాక్టిక్​లో పలు కీలక బాధ్యతలను శిరీష నిర్వహిస్తున్నారు.  

 అంతరిక్ష ప్రయాణంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం, అంతరిక్ష పర్యాటకంలో తమ ప్రస్థానాన్ని ప్రారంభించేందుకు.. బ్లూ ఆర్జిన్ సంస్థ ద్వారా అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ ఈనెల 20న అంతరిక్ష ప్రయాణం చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఆ సంస్థకు పోటీగా వర్జిన్ గెలాక్టిక్ చేసిన ఈ ప్రకటన.. అందులో తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి భాగస్వామ్యం కావడం.. సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నెల 11న "యూనిటీ -22" వాహక నౌక అంతరిక్ష ప్రయాణానికి సన్నద్ధమవుతోంది. అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ప్రయోగం చేస్తున్నట్లు వర్జిన్ గెలాక్టిక్​ తెలిపింది. వర్జిన్ గెలాక్టిక్ అందుకు కావలసిన అనుమతులను పొందింది.

ఇదీ చదవండి: 

'సార్వత్రిక ఉచిత వైద్యవ్యవస్థే ఉత్తమం'

Last Updated : Jul 2, 2021, 12:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.