తెదేపా నాయకుల అరెస్టులకు నిరసనగా..ఆ పార్టీ నేతలు చిత్తూరు జిల్లాలో నిరసన తెలిపారు. మదనపల్లెలో మాజీ ఎమ్మెల్యే రమేష్, కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి నిరసన తెలిపారు. రాష్ట్రంలో పథకం ప్రకారం తెదేపా నాయకులపై అక్రమ కేసులు బనాయించి భయపెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే రమేష్ ఆరోపించారు. వైకాపా ప్రభుత్వ అరెస్టులకు ఎవరు భయపడరన్నారు.
ఇదీ చదవండి: దేశంలో మరో 11,502 కేసులు.. 325 మరణాలు