ETV Bharat / state

రాష్ట్ర సరిహద్దులో గొయ్యి తవ్విన తమిళ అధికారులు

author img

By

Published : May 6, 2020, 11:22 AM IST

Updated : May 6, 2020, 1:02 PM IST

tamil-authorities-digging-pit-in-chittoor-borders
చిత్తూరు సరిహద్దుల్లో గొయ్యి తవ్విన తమిళ అధికారులు

11:15 May 06

చిత్తూరు సరిహద్దుల్లో గొయ్యి తవ్విన తమిళ అధికారులు

చిత్తూరు సరిహద్దుల్లో తమిళ అధికారులు రహదారికి అడ్డంగా గొయ్యి తవ్వారు. తమిళనాడులోని ఊత్తుకోటలో ఇద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా కారణంగా రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిషేధిస్తూ... ఆంధ్ర- తమిళనాడు సరిహద్దుల్లో రోడ్డుకు అడ్డంగా తమిళ అధికారులు భారీ గొయ్యి తవ్వారు. ఏపీ ప్రజలు ఎవరు తమ రాష్ట్రంలోకి రాకూడదంటూ...తమిళనాడు పోలీసులు గుంతలు తవ్వారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలం హనుమంతపురం వద్ద చోటుచేసుకుంది. గతంలో రోడ్డుకడ్డంగా గోడ కట్టారు తమిళ అధికారులు. ఈ విషయంపై స్పందించిన చిత్తూరు అధికారులు గోడ కూల్చేశారు.   

ఇవీ చదవండి...ఆమె కరోనాను జయించింది.. కానీ..!

11:15 May 06

చిత్తూరు సరిహద్దుల్లో గొయ్యి తవ్విన తమిళ అధికారులు

చిత్తూరు సరిహద్దుల్లో తమిళ అధికారులు రహదారికి అడ్డంగా గొయ్యి తవ్వారు. తమిళనాడులోని ఊత్తుకోటలో ఇద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా కారణంగా రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిషేధిస్తూ... ఆంధ్ర- తమిళనాడు సరిహద్దుల్లో రోడ్డుకు అడ్డంగా తమిళ అధికారులు భారీ గొయ్యి తవ్వారు. ఏపీ ప్రజలు ఎవరు తమ రాష్ట్రంలోకి రాకూడదంటూ...తమిళనాడు పోలీసులు గుంతలు తవ్వారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలం హనుమంతపురం వద్ద చోటుచేసుకుంది. గతంలో రోడ్డుకడ్డంగా గోడ కట్టారు తమిళ అధికారులు. ఈ విషయంపై స్పందించిన చిత్తూరు అధికారులు గోడ కూల్చేశారు.   

ఇవీ చదవండి...ఆమె కరోనాను జయించింది.. కానీ..!

Last Updated : May 6, 2020, 1:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.