ETV Bharat / state

శ్రీకాళహస్తి ఆలయంలో రాహు, కేతు పూజలకు పెరుగుతున్న ఆదరణ

author img

By

Published : Nov 19, 2020, 12:00 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో కరోనా కారణంగా రాహు, కేతు పూజలకు తగ్గిన ఆదరణ క్రమంగా పెరుగుతోంది. రవాణా పునరుద్ధరించినందున వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి వస్తున్నారు. పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని కరోనా ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆలయ అధికారులు తెలిపారు.

srikalahasti temple
శ్రీకాళహస్తిలో రాహు, కేతు పూజలకు పెరుగుతున్న ఆదరణ

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహు, కేతు, సర్ప దోష నివారణ పూజలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కరోనా కారణంగా కొంతకాలంగా ఆలయంలో దర్శనాలు నిలిపివేశారు. ప్రస్తుతం అన్​లాక్ ప్రకటించటంతో ఆలయానికి భక్తుల రాక మొదలైంది. ఆది, సోమ, మంగళవారాల్లో రాహు, కేతు పూజలు చేస్తారు. ఈ క్రమంలో భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. తమిళనాడు, కర్ణాటక, కేరళతోపాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తజనంతో ఆలయం కిటకిటలాడుతోంది.

అయితే జనం గుంపులుగా రావటంతో కరోనా ప్రమాదం పొంచి ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు. చాలామంది మాస్కులు ధరించడంలేదని.. భౌతిక దూరం మాటే లేదని అంటున్నారు. మరోపక్క కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు.

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి క్షేత్రంలో రాహు, కేతు, సర్ప దోష నివారణ పూజలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. కరోనా కారణంగా కొంతకాలంగా ఆలయంలో దర్శనాలు నిలిపివేశారు. ప్రస్తుతం అన్​లాక్ ప్రకటించటంతో ఆలయానికి భక్తుల రాక మొదలైంది. ఆది, సోమ, మంగళవారాల్లో రాహు, కేతు పూజలు చేస్తారు. ఈ క్రమంలో భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. తమిళనాడు, కర్ణాటక, కేరళతోపాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తజనంతో ఆలయం కిటకిటలాడుతోంది.

అయితే జనం గుంపులుగా రావటంతో కరోనా ప్రమాదం పొంచి ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు. చాలామంది మాస్కులు ధరించడంలేదని.. భౌతిక దూరం మాటే లేదని అంటున్నారు. మరోపక్క కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు.

ఇవీ చదవండి..

బద్వేల్​లో చేపల వేటకెళ్లి వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.