ETV Bharat / state

అద్వాన్నంగా రహదారులు... గ్రామస్థులకు తప్పని తిప్పలు

author img

By

Published : Dec 16, 2020, 10:41 PM IST

Updated : Dec 16, 2020, 11:04 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండల ప్రధాన రహదారులన్నీ అద్వాన్నంగా మారాయి. తుపాను, జోరు వర్షాలతో దారులు ధ్వంసం అయ్యాయి. రహదారులు దెబ్బతిని, ఇబ్బందులు పడుతున్నా అధికారులు స్పందించకపోవటంతో స్థానికులకు అవస్థలు తప్పటం లేదు.

roads damage in chandragiri
అధ్వాన్నంగా రహదారులు

అద్వాన్నంగా మారిన రహదారులు

వరుస తుపానులు, భారీ వర్షాలతో చిత్తూరు జిల్లా చంద్రగిరి మండల ప్రధాన రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. తిరుపతి నుంచి పుంగనూరుకు వెళ్లే దారి కల్వర్టు తెగి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

ఈ రహదారి చంద్రగిరి, పాకాల, పులిచెర్ల మండలాలను కలుపుతూ 40 గ్రామాల ప్రజలు తిరుపతి నగరానికి వచ్చేందుకు వీలుగా ఉండేది. తుపాను తాకిడికి దారి పూర్తిగా దెబ్బతినటంతో ఉద్యోగులకు, ఆయా గ్రామాలకు రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడుతున్నారు.

ఏ రంగంపేట నుంచి పాకాల మండలం పుదిపట్ల బయిల్ అడవి మార్గంలో పుంగనూరుకు ఏర్పాటు చేసిన రహదారి పూర్తిగా ధ్వంసం అయ్యింది. ఈ మార్గంలో ఉన్న ఏడు వంతెనల్లో మూడు వంతెనలు పూర్తిగా కుప్పకూలగా, మిగిలిన చోట్ల అధ్వాన్నంగా తయారయ్యాయి.

నీటి ప్రవాహం తగ్గినా, తాత్కాలిక వంతెనలు, దారులను నిర్మించకపోవటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న. ఆయా గ్రామాల ప్రజలు, ఉద్యోగస్తులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా, అధికారులు పట్టించుకోవటం లేదని వాపోతున్నారు.

తిరుపతి ఆర్టీసీ డిపో నుంచి పుంగనూరు రెండు బస్సులు ఈమార్గం గుండానే తిరిగేవి. రహదారులు కోతకు గురవటంతో బస్సుల సేవలు నిలిచిపోయాయి. దీంతో కాయగూరలు అమ్ముకునేందుకు తిరుపతి వెళ్లే రైతులకు కష్టాలు తప్పటం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, రహదారులను బాగు చేయాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి: 'ఆయుర్వేద ఆస్పత్రి హోదా పెంచండి'

అద్వాన్నంగా మారిన రహదారులు

వరుస తుపానులు, భారీ వర్షాలతో చిత్తూరు జిల్లా చంద్రగిరి మండల ప్రధాన రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. తిరుపతి నుంచి పుంగనూరుకు వెళ్లే దారి కల్వర్టు తెగి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

ఈ రహదారి చంద్రగిరి, పాకాల, పులిచెర్ల మండలాలను కలుపుతూ 40 గ్రామాల ప్రజలు తిరుపతి నగరానికి వచ్చేందుకు వీలుగా ఉండేది. తుపాను తాకిడికి దారి పూర్తిగా దెబ్బతినటంతో ఉద్యోగులకు, ఆయా గ్రామాలకు రాకపోకలు సాగించేందుకు అవస్థలు పడుతున్నారు.

ఏ రంగంపేట నుంచి పాకాల మండలం పుదిపట్ల బయిల్ అడవి మార్గంలో పుంగనూరుకు ఏర్పాటు చేసిన రహదారి పూర్తిగా ధ్వంసం అయ్యింది. ఈ మార్గంలో ఉన్న ఏడు వంతెనల్లో మూడు వంతెనలు పూర్తిగా కుప్పకూలగా, మిగిలిన చోట్ల అధ్వాన్నంగా తయారయ్యాయి.

నీటి ప్రవాహం తగ్గినా, తాత్కాలిక వంతెనలు, దారులను నిర్మించకపోవటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న. ఆయా గ్రామాల ప్రజలు, ఉద్యోగస్తులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా, అధికారులు పట్టించుకోవటం లేదని వాపోతున్నారు.

తిరుపతి ఆర్టీసీ డిపో నుంచి పుంగనూరు రెండు బస్సులు ఈమార్గం గుండానే తిరిగేవి. రహదారులు కోతకు గురవటంతో బస్సుల సేవలు నిలిచిపోయాయి. దీంతో కాయగూరలు అమ్ముకునేందుకు తిరుపతి వెళ్లే రైతులకు కష్టాలు తప్పటం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, రహదారులను బాగు చేయాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి: 'ఆయుర్వేద ఆస్పత్రి హోదా పెంచండి'

Last Updated : Dec 16, 2020, 11:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.