ETV Bharat / state

ఫిబ్రవరి 7న మదనపల్లికి రానున్న రాష్ట్రపతి

author img

By

Published : Jan 16, 2021, 7:16 PM IST

Updated : Jan 16, 2021, 9:01 PM IST

చిత్తూరు జిల్లా మదనపల్లిలో రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ పర్యటించనున్నారు. ఫిబ్రవరి 7న సత్సంగ్ ఫౌండేషన్ ఆవరణలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు.

president-ram-nath-kovind-will-visit-madanapalle
రాష్ట్రపతి రాక

రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ చిత్తూరు జిల్లా మదనపల్లికి రానున్నారు. ఫిబ్రవరి 7న సత్సంగ్ ఫౌండేషన్ ఆవరణలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రపతి రాక సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే నవాజ్ బాషా, ఉప పాలనాధికారి జాహ్నవి, డీఎస్పీ రవి మనోహర్ ఆచారి, తదితరులు సత్సంగ్ ఫౌండేషన్​కు వెళ్లి స్థల పరిశీలన చేశారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత, సత్సంగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముంతాజ్ అలీతో కలిసి హెలిప్యాడ్, రాష్ట్రపతి బస చేసే విడిది, తదితర ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.

రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ చిత్తూరు జిల్లా మదనపల్లికి రానున్నారు. ఫిబ్రవరి 7న సత్సంగ్ ఫౌండేషన్ ఆవరణలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రపతి రాక సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే నవాజ్ బాషా, ఉప పాలనాధికారి జాహ్నవి, డీఎస్పీ రవి మనోహర్ ఆచారి, తదితరులు సత్సంగ్ ఫౌండేషన్​కు వెళ్లి స్థల పరిశీలన చేశారు. పద్మభూషణ్ అవార్డు గ్రహీత, సత్సంగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ముంతాజ్ అలీతో కలిసి హెలిప్యాడ్, రాష్ట్రపతి బస చేసే విడిది, తదితర ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.

ఇదీ చదవండి: పుత్తూరులో ఏనుగుల సంచారం.. భయాందోళనలో స్థానికులు

Last Updated : Jan 16, 2021, 9:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.