చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు మండల పరిధిలోని అగరం ఆంజనేయ స్వామి గుడిలో నంది విగ్రహం ఇటీవల ధ్వంసమైంది. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడమే లక్ష్యంగా ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు.
3 గంటల పాటు విచారణలో పాల్గొన్న ఎస్పీ
స్వయంగా చిత్తూరు ఎస్పీ సెంథిల్కుమార్ జీడీనెల్లూరు పోలీస్స్టేషన్లో 3 గంటలుగా కొనసాగుతున్న విచారణలో పాల్గొన్నారు. జీడీనెల్లూరు ఠాణాలో సుమారు 50 మందిని పోలీసులు విచారిస్తున్నారు. నిందితులు జీడీనెల్లూరు, పాలసముద్రం మండలాల వాసులుగా గుర్తించారు.