ETV Bharat / state

నంది విగ్రహం ధ్వంసం కేసులో 50 మంది విచారణ

చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు మండలంలోని ఆంజనేయ స్వామి గుడిలో నంది విగ్రహం ధ్వంసమైన కేసులో పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. మూడు గంటల పాటు సాగిన విచారణలో జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ స్వయంగా పాల్గొన్నారు.

author img

By

Published : Sep 27, 2020, 11:17 PM IST

నంది విగ్రహం ధ్వంసం కేసులో 50 మందిని విచారిస్తున్న పోలీసులు
నంది విగ్రహం ధ్వంసం కేసులో 50 మందిని విచారిస్తున్న పోలీసులు

చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు మండల పరిధిలోని అగరం ఆంజనేయ స్వామి గుడిలో నంది విగ్రహం ఇటీవల ధ్వంసమైంది. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడమే లక్ష్యంగా ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు.

3 గంటల పాటు విచారణలో పాల్గొన్న ఎస్పీ

స్వయంగా చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమార్‌ జీడీనెల్లూరు పోలీస్​స్టేషన్‌లో 3 గంటలుగా కొనసాగుతున్న విచారణలో పాల్గొన్నారు. జీడీనెల్లూరు ఠాణాలో సుమారు 50 మందిని పోలీసులు విచారిస్తున్నారు. నిందితులు జీడీనెల్లూరు, పాలసముద్రం మండలాల వాసులుగా గుర్తించారు.

చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు మండల పరిధిలోని అగరం ఆంజనేయ స్వామి గుడిలో నంది విగ్రహం ఇటీవల ధ్వంసమైంది. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడమే లక్ష్యంగా ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు.

3 గంటల పాటు విచారణలో పాల్గొన్న ఎస్పీ

స్వయంగా చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమార్‌ జీడీనెల్లూరు పోలీస్​స్టేషన్‌లో 3 గంటలుగా కొనసాగుతున్న విచారణలో పాల్గొన్నారు. జీడీనెల్లూరు ఠాణాలో సుమారు 50 మందిని పోలీసులు విచారిస్తున్నారు. నిందితులు జీడీనెల్లూరు, పాలసముద్రం మండలాల వాసులుగా గుర్తించారు.

ఇవీ చూడండి:

తెదేపా పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు వీరే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.