ETV Bharat / state

'ప్రకృతి వ్యవసాయానికి పూర్తి సహకారాలు అందిస్తాం'

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలం ఎద్దులవారిపల్లి గ్రామంలో చేపట్టిన ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఆదర్శవంతమైనవని హైదరాబాద్ ఎన్ఆర్ఎల్ఎం డైరెక్టర్ రమణారెడ్డి అన్నారు. ఈ రకం వ్యవసాయ పద్ధతులను దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఈటీవీ లో ప్రసారమైన ఎద్దుల వారి పల్లి ప్రకృతి వ్యవసాయం కథనాలను చూసి తంబళ్లపల్లి మండలంలో పర్యటించినట్లు తెలిపారు.

author img

By

Published : Feb 5, 2021, 6:47 AM IST

NRLM Director Ramanareddy visits Tamballapalle zone of Chittoor district
'ప్రకృతి వ్యవసాయానికి పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తాం'

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలం ఎద్దులవారిపల్లి గ్రామంలో చేపట్టిన జెడ్బీఎన్ఎఫ్ఎఫ్ వ్యవసాయ పద్ధతులు ఆదర్శవంతమైనవని హైదరాబాద్ నేషనల్ రూరల్ లైవ్లీ వుడ్ మిషన్ డైరెక్టర్ రమణారెడ్డి తెలిపారు. ఈ రకం వ్యవసాయ పద్ధతులను దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈటీవీ లో ప్రసారమైన ఎద్దుల వారి పల్లి ప్రకృతి వ్యవసాయం కథనాలను చూసి తంబళ్లపల్లి మండలంలో పర్యటించినట్లు చెప్పారు. గ్రామంలో క్షేత్ర స్థాయిలో పర్యటించిన రమణారెడ్డి.. వివిధ రకాల పంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు.

చిత్తూరు జిల్లా స్థాయిలో ప్రకృతి వ్యవసాయ రంగంలో ఆదర్శ మహిళా రైతుగా గుర్తింపు తెచ్చుకున్న గుట్ట మీద పల్లె రామసుబ్బమ్మ, భాస్కర్ రెడ్డి దంపతులను అభినందించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై సమీక్షించారు. ఎదుటివారిపల్లిలోని జెడ్బీఎన్ఎఫ్ఎఫ్ రైతులతో పాటు, ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతులతో.. అంగన్వాడీ కార్యకర్తలు, రైతులు సాగుచేసిన పెరటి తోటలు, సూర్యమండల ఆకార కిచెన్ గార్డెన్​లను పరిశీలించి అభినందించారు.

రక్తహీనత నివారణ, విష ప్రభావం లేని పౌష్టికాహారం అందించే లక్ష్యంతో చేపట్టిన ప్రకృతి వ్యవసాయం నేటి తరానికి ఎంతో అవసరమని రమణారెడ్డి తెలిపారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. చిత్తూరు డీపీఎం వెంకటేశ్వర్లు, తంబళ్లపల్లె వెలుగు ఏరియా కోఆర్డినేటర్ గంగాధర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె మండలం ఎద్దులవారిపల్లి గ్రామంలో చేపట్టిన జెడ్బీఎన్ఎఫ్ఎఫ్ వ్యవసాయ పద్ధతులు ఆదర్శవంతమైనవని హైదరాబాద్ నేషనల్ రూరల్ లైవ్లీ వుడ్ మిషన్ డైరెక్టర్ రమణారెడ్డి తెలిపారు. ఈ రకం వ్యవసాయ పద్ధతులను దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈటీవీ లో ప్రసారమైన ఎద్దుల వారి పల్లి ప్రకృతి వ్యవసాయం కథనాలను చూసి తంబళ్లపల్లి మండలంలో పర్యటించినట్లు చెప్పారు. గ్రామంలో క్షేత్ర స్థాయిలో పర్యటించిన రమణారెడ్డి.. వివిధ రకాల పంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు.

చిత్తూరు జిల్లా స్థాయిలో ప్రకృతి వ్యవసాయ రంగంలో ఆదర్శ మహిళా రైతుగా గుర్తింపు తెచ్చుకున్న గుట్ట మీద పల్లె రామసుబ్బమ్మ, భాస్కర్ రెడ్డి దంపతులను అభినందించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై సమీక్షించారు. ఎదుటివారిపల్లిలోని జెడ్బీఎన్ఎఫ్ఎఫ్ రైతులతో పాటు, ఆర్గానిక్ వ్యవసాయ పద్ధతులతో.. అంగన్వాడీ కార్యకర్తలు, రైతులు సాగుచేసిన పెరటి తోటలు, సూర్యమండల ఆకార కిచెన్ గార్డెన్​లను పరిశీలించి అభినందించారు.

రక్తహీనత నివారణ, విష ప్రభావం లేని పౌష్టికాహారం అందించే లక్ష్యంతో చేపట్టిన ప్రకృతి వ్యవసాయం నేటి తరానికి ఎంతో అవసరమని రమణారెడ్డి తెలిపారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. చిత్తూరు డీపీఎం వెంకటేశ్వర్లు, తంబళ్లపల్లె వెలుగు ఏరియా కోఆర్డినేటర్ గంగాధర్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రపతి చిత్తూరు పర్యటనకు విస్తృత ఏర్పాట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.