వైకాపా అధికారం చేపట్టి ఏడాది పూర్తైన సందర్భంగా 'మన పాలన - మీ సూచన' పేరుతో సీఎం ...జిల్లా మంత్రులు, నాయకులతో నిర్వహిస్తున్న అంతర్జాల సమీక్ష సమావేశాలు రెండవ రోజు ప్రారంభమయ్యాయి. ఎస్వీ విశ్వవిద్యాలయం సెనేట్ హాల్ లో ఈ రోజు వ్యవసాయం, తదితర అంశాల పై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, పలు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ పరిపాలనపై ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నారు.
ఇదీ చదవండి: అంతర్జాతీయ సానుకూలతలతో దూసుకెళ్తోన్న మార్కెట్లు