ETV Bharat / state

'పార్లమెంటులో ప్రశ్నించే గొంతుక కావాలి.. భయపడేవాళ్లది కాదు'

author img

By

Published : Apr 4, 2021, 9:17 PM IST

చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో లోకేశ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 21 మంది ఎంపీలున్న అధికారపార్టీ.. పార్లమెంటుకు వెళ్లి ఏం సాధించింది అని ప్రశ్నించారు. పార్లమెంటులో ప్రశ్నించే గళం కావాలి.. భయపడేవారు కాదన్నారు.

Lokesh Election Campaign in Chittor district
సత్యవేడు నియోజకవర్గంలో లోకేశ్‌ ఎన్నికల ప్రచారం

తిరుపతి ఉప ఎన్నికల్లో తెదేపా ప్రచారాన్ని విస్తృతం చేసింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్... సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని వరదయ్యపాలెం మండలంలో ప్రచారం నిర్వహించారు. మండల కేంద్రం వరదయ్యపాలెంలోని చెంగాలమ్మగుడి, తూర్పు వీధి, బజార్ వీధి, గోవర్ధనపురం, పద్మావతిపురం, ఇందిరానగర్ సెంటర్, సి.ఎల్.ఎన్ పల్లి, లక్ష్మిపురం ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం చేశారు.

గడిచిన రెండు సంవత్సరాల్లో వైకాపా పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. 21 మంది ఎంపీలు పార్లమెంటుకు వెళ్లి ఏం సాధించారు అని లోకేశ్‌ నిలదీశారు. హోదా, ఉక్కు, పోలవరం, రైల్వే జోన్‌పై నిలదీసింది తెదేపా ఎంపీలేనని లోకేశ్ అభిప్రాయపడ్డారు. పార్లమెంటులో ప్రశ్నించే గళం కావాలి.. భయపడేవారు కాదన్నారు. ప్రజలకు సేవ చేసేవారు కావాలా.. జగన్‌కు సేవ చేసేవారు కావాలా అని లోకేశ్‌ ప్రశ్నించారు.

వృద్దులను అప్యాయంగా పలకరించిన లోకేశ్.. పింఛన్ అందుతున్న తీరుపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. తిరుపతి ఉపఎన్నికల్లో అభ్యర్ధి పనబాక లక్ష్మికి ఓటు వేయడం ద్వారా పెన్షన్ మొత్తం మూడు వేల రూపాయలకు పెరుగుతుందని హామీ ఇచ్చారు. ప్రచారంలో లోకేశ్​తో పాటు గాలి భానుప్రకాష్, పులివర్తి నాని ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తిరుపతి ఉప ఎన్నికల్లో తెదేపా ప్రచారాన్ని విస్తృతం చేసింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్... సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని వరదయ్యపాలెం మండలంలో ప్రచారం నిర్వహించారు. మండల కేంద్రం వరదయ్యపాలెంలోని చెంగాలమ్మగుడి, తూర్పు వీధి, బజార్ వీధి, గోవర్ధనపురం, పద్మావతిపురం, ఇందిరానగర్ సెంటర్, సి.ఎల్.ఎన్ పల్లి, లక్ష్మిపురం ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం చేశారు.

గడిచిన రెండు సంవత్సరాల్లో వైకాపా పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. 21 మంది ఎంపీలు పార్లమెంటుకు వెళ్లి ఏం సాధించారు అని లోకేశ్‌ నిలదీశారు. హోదా, ఉక్కు, పోలవరం, రైల్వే జోన్‌పై నిలదీసింది తెదేపా ఎంపీలేనని లోకేశ్ అభిప్రాయపడ్డారు. పార్లమెంటులో ప్రశ్నించే గళం కావాలి.. భయపడేవారు కాదన్నారు. ప్రజలకు సేవ చేసేవారు కావాలా.. జగన్‌కు సేవ చేసేవారు కావాలా అని లోకేశ్‌ ప్రశ్నించారు.

వృద్దులను అప్యాయంగా పలకరించిన లోకేశ్.. పింఛన్ అందుతున్న తీరుపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. తిరుపతి ఉపఎన్నికల్లో అభ్యర్ధి పనబాక లక్ష్మికి ఓటు వేయడం ద్వారా పెన్షన్ మొత్తం మూడు వేల రూపాయలకు పెరుగుతుందని హామీ ఇచ్చారు. ప్రచారంలో లోకేశ్​తో పాటు గాలి భానుప్రకాష్, పులివర్తి నాని ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

పవన్ రాష్ట్రానికి అద్దె మైకులా తయారయ్యారు: పేర్ని నాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.