ETV Bharat / state

ఆవు దాడిలో వ్యక్తి మృతి.. బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే సాయం

author img

By

Published : Aug 13, 2020, 10:26 PM IST

ఇటీవల ఆవు తొక్కిన ఘటనలో చిత్తూరు జిల్లా గంగవరం మండలం కలగటూరుకు చెందిన వెంకట్రామయ్య మృతి చెందాడు. అతని కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందిస్తున్నట్లు మదనపల్లె ఆర్డీవో మురళి, పలమనేరు ఎమ్మెల్యే డాక్టర్ ఎన్. వెంకట గౌడ తెలిపారు.

In an incident of cow tramped.. MLA financial assistance to the family of deceased
ఆవు తొక్కిన ఘటనలో.. మృతుని కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం

చిత్తూరు జిల్లా గంగవరం మండలం కలగటూరుకు చెందిన వెంకట్రామయ్య కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందిస్తున్నట్లు మదనపల్లె ఆర్డీవో మురళి, పలమనేరు ఎమ్మెల్యే డాక్టర్ ఎన్. వెంకట గౌడ తెలిపారు. ఇటీవల ఆవు తొక్కిన ఘటనలో అతడు మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే గౌడ తన సొంత నిధుల నుంచి వెంకట్రామయ్య అంత్యక్రియల కోసం పది వేల రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు.

అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి లక్ష రూపాయలు సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఆర్డీవో మురళి బుధవారం పలమనేరు ఏరియా ఆసుపత్రిలో వెంకట్రామయ్యకు అందించిన చికిత్సపై వివరాలు సేకరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆవు యజమానిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

చిత్తూరు జిల్లా గంగవరం మండలం కలగటూరుకు చెందిన వెంకట్రామయ్య కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందిస్తున్నట్లు మదనపల్లె ఆర్డీవో మురళి, పలమనేరు ఎమ్మెల్యే డాక్టర్ ఎన్. వెంకట గౌడ తెలిపారు. ఇటీవల ఆవు తొక్కిన ఘటనలో అతడు మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే గౌడ తన సొంత నిధుల నుంచి వెంకట్రామయ్య అంత్యక్రియల కోసం పది వేల రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు.

అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి లక్ష రూపాయలు సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఆర్డీవో మురళి బుధవారం పలమనేరు ఏరియా ఆసుపత్రిలో వెంకట్రామయ్యకు అందించిన చికిత్సపై వివరాలు సేకరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆవు యజమానిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

కరోనా భాధితులకు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి పరామర్శ

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.