చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు సమీపంలో శిల్పారామం వద్దనున్న పెట్రోల్ బంకు వద్ద వినియోగదారులు స్థానికులతో కలసి ఆందోళన చేపట్టారు. ఓ వ్యక్తి ఆయిల్ పట్టించుకుంటుండగా మోసం చేస్తున్నారని గ్రహించి..అతను సిబ్బందిని నిలదీశారు. సిబ్బంది బుకాయించే ప్రయత్నం చేశారు. పెట్రోల్ పట్టకుండా పట్టినట్లు నటిస్తూ మోసం చేస్తున్నారని వినియోగదారులు బంకు వద్ద ఆందోళన చేపట్టారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని యాజమాన్యం చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఇలా అవినీతికి పాల్పడే దుకాణాలను గుర్తించి లైసెన్సులు రద్దు చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి. దిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న రెండో కిసాన్ రైలు