ETV Bharat / state

తిరుమలలో అగ్నిప్రమాదం... ఒకరు సజీవదహనం

author img

By

Published : May 4, 2021, 7:54 AM IST

Updated : May 4, 2021, 12:28 PM IST

తిరుమలలోని ఆస్థాన మండపం వద్దనున్న దుకాణాల్లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 దుకాణాలు దగ్ధం కాగా.. ఒకరు సజీవదహనమయ్యారు.

fire-accident-in-tirumala
fire-accident-in-tirumala

తిరుమలలో ఆస్థానమండపంలోని దుకాణ సముదాయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఉదయం ఆరున్నర గంటల సమయంలో శ్రీవారి చిత్ర పటాలు విక్రయించే దుకాణంలో మంటలు చెలరేగాయి. కొద్ది సమయంలోనే వేగంగా మంటలు ఇతర షాపులకు వ్యాపించారు.. ఈ ఘటనలో 20 దుకాణాలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. శకలాలు తొలగిస్తుండగా షాపు నెం.84లో ఓ మృతదేహం లభ్యమైంది. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రూ.30 లక్షలకు పైగా నష్టం వాటిలిందని అగ్నిమాపక, తితిదే విజిలెన్స్ అధికారులు అంచనా వేశారు. ఆగ్నిప్రమాదంతో తాము నిండా మునిగి పోయామని బాధితులు వాపోయారు.

తిరుమలలో ఆస్థానమండపంలోని దుకాణ సముదాయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఉదయం ఆరున్నర గంటల సమయంలో శ్రీవారి చిత్ర పటాలు విక్రయించే దుకాణంలో మంటలు చెలరేగాయి. కొద్ది సమయంలోనే వేగంగా మంటలు ఇతర షాపులకు వ్యాపించారు.. ఈ ఘటనలో 20 దుకాణాలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. శకలాలు తొలగిస్తుండగా షాపు నెం.84లో ఓ మృతదేహం లభ్యమైంది. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. రూ.30 లక్షలకు పైగా నష్టం వాటిలిందని అగ్నిమాపక, తితిదే విజిలెన్స్ అధికారులు అంచనా వేశారు. ఆగ్నిప్రమాదంతో తాము నిండా మునిగి పోయామని బాధితులు వాపోయారు.

తిరుమలలో అగ్నిప్రమాదం

ఇదీ చదవండి

తిరుమల విశిష్టత పెంచేలా చర్యలు తీసుకుంటాం: ఎంపీ గురుమూర్తి

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో దర్శనం వేళలు కుదింపు

Last Updated : May 4, 2021, 12:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.