ETV Bharat / state

మద్యం కోసం ఆరాటం...కరోనాతో పోరాటం

నిన్నటి వరకూ రాష్ట్రంలో ఎక్కడ విన్నా..కరోనా గురించే...కానీ ఈరోజు హాట్ టాపిక్ గా మారారు మందుబాబులు. దాదాపు 44రోజులు తరువాతా అన్ని మద్యం దుకాణాలు తెరుచుకోవటంతో పరుగులుతీశారు.మొన్నటి వరకూ రేషన్ దుకాణాల ముందు ఉన్న లైన్లు అంతకుమించి బార్ల ముందు ఉన్నాయి. చేతికి గొడుకు ముఖానికి మాస్క్ ఉండగా మాకు ఇక భయమెందుకు దండగా అనే రీతిలో సామాజిక దూరాన్ని మరచి మందు కోసం ఎగబడతున్నారు చిత్తూరు జిల్లాలోని మద్యం ప్రియులు....

author img

By

Published : May 4, 2020, 7:37 PM IST

మద్యం కోసం ఆరాటం...కరోనాతో పోరాటం
corund at all bar and resturents in chittoor dst and not maintaing social distance

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రెడ్ జోన్లు మినహా అన్నీ ప్రాంతాల్లో ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరిచారు. గుంపులు గుంపులుగా మద్యం కోసం గుమిగూడిన వారిని చెదరగొట్టడానికి అధికారులు నానా తంటాలు పడ్డారు. లాక్ డౌన్ నిబంధనలు పాటించని కారణంగా పరిసర ప్రాంత ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

పడమటి మండలాల్లో మద్యం షాపుల వద్ద ప్రజలు బారులు తీరారు. తంబళ్లపల్లి పోలీసులు, ములకలచెరువు ఎక్సైజ్ అధికారులు తప్పనిసరిగా గొడుగు, మాస్క్ ఉండాల్సిందేనని నిబంధన విధించగా.. వాటితోనే జనాలు వచ్చారు. విపరీతమైన ఎండను భరించిన మద్యం ప్రియులు తంబళ్లపల్లె నియోజకవర్గంలోని మద్యం షాపుల వద్ద ఎదురు చూశారు.

కర్ణాటక ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లోని ఇరు రాష్ట్రాల తరఫున మద్యం దుకాణాలు తెరుచుకోగా.. దుకాణాల వద్ద బారులు తీరి మద్యాన్ని కొనుగోలు చేశారు. కొన్ని చోట్ల మందు బాబులు 20 నుంచి 30 మద్యం సీసాలను కొనుక్కున్నారు. కుప్పం నియోజకవర్గంలో చాలాచోట్ల మందుబాబులు ద్విచక్ర వాహనాలపైనే కాక.. కాలినడకన వెళ్లి మద్యాన్ని కొనుగోలు చేశారు.

పుంగనూరులో 22 మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. మద్యం ప్రియులు సామాజిక దూరం పాటిస్తూ కొనుగోలు చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఇదీ చూడండి:

ఆ దృశ్యాలు చూసి షాక్​కు గురయ్యా: చంద్రబాబు

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రెడ్ జోన్లు మినహా అన్నీ ప్రాంతాల్లో ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరిచారు. గుంపులు గుంపులుగా మద్యం కోసం గుమిగూడిన వారిని చెదరగొట్టడానికి అధికారులు నానా తంటాలు పడ్డారు. లాక్ డౌన్ నిబంధనలు పాటించని కారణంగా పరిసర ప్రాంత ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

పడమటి మండలాల్లో మద్యం షాపుల వద్ద ప్రజలు బారులు తీరారు. తంబళ్లపల్లి పోలీసులు, ములకలచెరువు ఎక్సైజ్ అధికారులు తప్పనిసరిగా గొడుగు, మాస్క్ ఉండాల్సిందేనని నిబంధన విధించగా.. వాటితోనే జనాలు వచ్చారు. విపరీతమైన ఎండను భరించిన మద్యం ప్రియులు తంబళ్లపల్లె నియోజకవర్గంలోని మద్యం షాపుల వద్ద ఎదురు చూశారు.

కర్ణాటక ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లోని ఇరు రాష్ట్రాల తరఫున మద్యం దుకాణాలు తెరుచుకోగా.. దుకాణాల వద్ద బారులు తీరి మద్యాన్ని కొనుగోలు చేశారు. కొన్ని చోట్ల మందు బాబులు 20 నుంచి 30 మద్యం సీసాలను కొనుక్కున్నారు. కుప్పం నియోజకవర్గంలో చాలాచోట్ల మందుబాబులు ద్విచక్ర వాహనాలపైనే కాక.. కాలినడకన వెళ్లి మద్యాన్ని కొనుగోలు చేశారు.

పుంగనూరులో 22 మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. మద్యం ప్రియులు సామాజిక దూరం పాటిస్తూ కొనుగోలు చేసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఇదీ చూడండి:

ఆ దృశ్యాలు చూసి షాక్​కు గురయ్యా: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.