ETV Bharat / state

జిల్లాలో కరోనా ఉద్ధృతి.. 18,334కు చేరిన కేసులు

author img

By

Published : Aug 11, 2020, 9:47 PM IST

చిత్తూరు జిల్లాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఇప్పటివరకూ 18,334 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కువగా కేసులు నమోదవుతున్న తిరుపతిలో 14 రోజుల పాటు లాక్​డౌన్​ విధించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

జిల్లాలో కరోనా ఉద్ధృతి.. 18,334కు చేరిన కేసులు
జిల్లాలో కరోనా ఉద్ధృతి.. 18,334కు చేరిన కేసులు

చిత్తూరు జిల్లాలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. మంగళవారం జిల్లాలో 758 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్​ కేసుల సంఖ్య 18,334కు చేరింది. మంగళవారం ఒక్కరోజే కరోనా బారిన పడి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. తిరుపతిలో అధిక కేసులు నమోదవుతున్న దృష్ట్యా అధికారులు 14 రోజుల పాటు నగరంలో లాక్​డౌన్​ విధించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలకు అనుమతిస్తున్నారు.

తిరుమల బైపాస్​ రోడ్​లో మాత్రం లాక్​డౌన్​కు మినహాయింపు ఇచ్చారు. అక్కడ యథావిధిగా వాహనాలను అనుమతిస్తున్నారు. జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో ఇప్పటివరకూ 10,945 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 7,200 యాక్టివ్​ కేసులకు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. మంగళవారం జిల్లాలో 758 పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్​ కేసుల సంఖ్య 18,334కు చేరింది. మంగళవారం ఒక్కరోజే కరోనా బారిన పడి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. తిరుపతిలో అధిక కేసులు నమోదవుతున్న దృష్ట్యా అధికారులు 14 రోజుల పాటు నగరంలో లాక్​డౌన్​ విధించారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలకు అనుమతిస్తున్నారు.

తిరుమల బైపాస్​ రోడ్​లో మాత్రం లాక్​డౌన్​కు మినహాయింపు ఇచ్చారు. అక్కడ యథావిధిగా వాహనాలను అనుమతిస్తున్నారు. జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో ఇప్పటివరకూ 10,945 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 7,200 యాక్టివ్​ కేసులకు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చూడండి..

వైఎస్​ఆర్​ చేయూతపై ఉత్తర్వులు...ఎవరు అర్హులంటే...?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.