ETV Bharat / state

జిల్లాలో కొత్తగా 452 కరోనా కేసులు.. ఐదుగురు మృతి

author img

By

Published : Jul 29, 2020, 3:59 AM IST

చిత్తూరు జిల్లాలో కరోనా వ్యాప్తి రోజు రోజుకీ విజృంభిస్తోంది. మంగళవారం జిల్లాలో 452 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజే కరోనాతో 5గురు ప్రాణాలు కోల్పోయారు. తిరుపతిలోనే అధిక సంఖ్యలో నమోదవుతున్న కేసులను దృష్ట్యా.. అధికారులు 14 రోజుల పాటు నగరంలో లాక్​డౌన్ విధించారు.

corona cases
corona cases

చిత్తూరు జిల్లాలో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకు పెరిగిపోతున్న కేసులతో జిల్లాలో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. మంగళవారం జిల్లాలో 452 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకూ నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 8,261 కి చేరింది. మంగళవారం కరోనాతో 5 గురు ప్రాణాలు కోల్పోగా.. జిల్లాలో కరోనా మృతుల సంఖ్య 89కి చేరుకుంది. ఒక్క తిరుపతిలోనే అధిక సంఖ్యలో నమోదవుతున్న కేసులను దృష్ట్యా.. అధికారులు 14 రోజుల పాటు నగరంలో లాక్​డౌన్ విధించారు. దుకాణాల నిర్వహణకు ఉదయం 6 నుంచి 11 గంటల వరకే అనుమతి ఇచ్చారు. 11గంటల తర్వాత దుకాణాలను మూసి వేయడంతో పాటు.. రోడ్ల పైకి వాహనాలను ప్రజలను అనుమతించకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. తిరుమల బైపాస్ రోడ్ కి మాత్రం.. లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. అక్కడ యధావిధిగా వాహనాల రవాణాకు అనుమతి కల్పించారు. జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో ఇప్పటివరకు.. 4,680 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకోగా.. 3,492 యాక్టివ్ కేసులకు జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకు పెరిగిపోతున్న కేసులతో జిల్లాలో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. మంగళవారం జిల్లాలో 452 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకూ నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 8,261 కి చేరింది. మంగళవారం కరోనాతో 5 గురు ప్రాణాలు కోల్పోగా.. జిల్లాలో కరోనా మృతుల సంఖ్య 89కి చేరుకుంది. ఒక్క తిరుపతిలోనే అధిక సంఖ్యలో నమోదవుతున్న కేసులను దృష్ట్యా.. అధికారులు 14 రోజుల పాటు నగరంలో లాక్​డౌన్ విధించారు. దుకాణాల నిర్వహణకు ఉదయం 6 నుంచి 11 గంటల వరకే అనుమతి ఇచ్చారు. 11గంటల తర్వాత దుకాణాలను మూసి వేయడంతో పాటు.. రోడ్ల పైకి వాహనాలను ప్రజలను అనుమతించకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. తిరుమల బైపాస్ రోడ్ కి మాత్రం.. లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. అక్కడ యధావిధిగా వాహనాల రవాణాకు అనుమతి కల్పించారు. జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో ఇప్పటివరకు.. 4,680 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకోగా.. 3,492 యాక్టివ్ కేసులకు జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చదవండి: బెడ్లు లేవనే మాట ఎట్టి పరిస్థితుల్లోనూ వినపడొద్దు: సీఎం జగన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.