ETV Bharat / state

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఘనంగా రథోత్సవం

author img

By

Published : Mar 12, 2021, 3:53 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా రథోత్సవం వైభవంగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.

chariot festival at the Srikalahasti temple
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఘనంగా రథోత్సవం

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఘనంగా రథోత్సవం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆలయ ఈవో పెద్దిరాజు.. రథాలను ప్రారంభించారు. స్వామి, అమ్మవార్లను రెండు వేర్వేరు రథాలపై కొలువుదీర్చి మాడ వీధుల్లో ఊరేగించారు. దైవ నామస్మరణలతో భక్తులు రథాలు లాగారు. వాటిపై ఉప్పు, మిరియాలు చల్లి మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానికి వచ్చినవారితో శ్రీకాళహస్తి భక్తజన సంద్రంగా మారింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయాధికారులు, పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఘనంగా రథోత్సవం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆలయ ఈవో పెద్దిరాజు.. రథాలను ప్రారంభించారు. స్వామి, అమ్మవార్లను రెండు వేర్వేరు రథాలపై కొలువుదీర్చి మాడ వీధుల్లో ఊరేగించారు. దైవ నామస్మరణలతో భక్తులు రథాలు లాగారు. వాటిపై ఉప్పు, మిరియాలు చల్లి మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానికి వచ్చినవారితో శ్రీకాళహస్తి భక్తజన సంద్రంగా మారింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయాధికారులు, పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

ఇదీ చదవండి: పురుషామృగ వాహనంపై శ్రీ సోమస్కంధమూర్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.