ETV Bharat / state

చిత్తూరులో ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం

Bus accident: కార్తిక పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని అరుణాచలం వెళ్లిన కడప డిపో ఆర్టీసీ బస్సు తిరిగి వస్తూ చిత్తూరు జిల్లాలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. డ్రైవర్​ నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

author img

By

Published : Nov 8, 2022, 12:01 PM IST

Bus accident
Bus accident

Bus accident: కార్తిక పౌర్ణమి సందర్భంగా కడప డిపో నుంచి నిన్న తమిళనాడులోని అరుణాచలానికి ఆరు బస్సులు భక్తులతో వెళ్లాయి. అక్కడ దర్శనం ముగించుకుని తిరిగి రాత్రి కడపకు బయలుదేరగా అందులో ఓ బస్సు చిత్తూరు సమీపంలో ప్రమాదానికి గురైంది. డ్రైవర్​ నిద్రమత్తులోకి జారుకోవడం, రహదారిపై స్పీడ్​ బ్రేకర్​ ఉండడంతో బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న పెట్రోల్​ బంకులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. దూర ప్రాంతాలకు వెళ్లే సర్వీసులకు ఆర్టీసీ డ్రైవర్లను పంపాల్సి ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకుండా కాంట్రాక్టు డ్రైవర్​ను పంపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడిన వారికి ప్రథమ చికిత్స కూడా చేయించకుండా అదే బస్సులో కడపకు తీసుకొచ్చారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని యూనియన్​ నాయకులు ఆరోపిస్తున్నారు.

Bus accident: కార్తిక పౌర్ణమి సందర్భంగా కడప డిపో నుంచి నిన్న తమిళనాడులోని అరుణాచలానికి ఆరు బస్సులు భక్తులతో వెళ్లాయి. అక్కడ దర్శనం ముగించుకుని తిరిగి రాత్రి కడపకు బయలుదేరగా అందులో ఓ బస్సు చిత్తూరు సమీపంలో ప్రమాదానికి గురైంది. డ్రైవర్​ నిద్రమత్తులోకి జారుకోవడం, రహదారిపై స్పీడ్​ బ్రేకర్​ ఉండడంతో బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న పెట్రోల్​ బంకులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. దూర ప్రాంతాలకు వెళ్లే సర్వీసులకు ఆర్టీసీ డ్రైవర్లను పంపాల్సి ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోకుండా కాంట్రాక్టు డ్రైవర్​ను పంపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గాయపడిన వారికి ప్రథమ చికిత్స కూడా చేయించకుండా అదే బస్సులో కడపకు తీసుకొచ్చారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని యూనియన్​ నాయకులు ఆరోపిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.