ETV Bharat / state

నిల్చున్న మూర్తిగా... అత్తివరద రాజస్వామి దర్శనం

40 ఏళ్లకి ఓసారి భక్తులకు 48 రోజులపాటు దర్శనమిస్తారు కంచి అత్తి వరదరాజ స్వామి. ఆగష్టు 1 నుంచి 17వ తేదీ వరకూ నిల్చున్న మూర్తిగా భక్తులకు దర్శనమివ్ననున్నారు.

author img

By

Published : Jul 29, 2019, 11:51 PM IST

నిల్చున్న మూర్తిగా అత్తివరద రాజస్వామి దర్శనం
నిల్చున్న మూర్తిగా అత్తివరద రాజస్వామి దర్శనం

నలభై ఏళ్ల పాటు ఆలయ కోనేటి గర్భంలో ఉండి 40 సంవత్సరాలకోసారి కంచి అత్తి వరద రాజస్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు. గత 29 రోజులుగా శయన మూర్తిగా ఆశీస్సులు అందిస్తున్న స్వామి వారు ఈ ఆగష్టు 1 నుంచి 17వ తేదీ వరకూ నిల్చున్న రూపంలో దీవించనున్నారు. ఆగష్టు 18వ తేదీన వరదరాజ స్వామి తిరిగి ఆలయ కోనేటి జలగర్భంలోకి వెళ్లనున్నారు. మరో 40 సంవత్సరాల తర్వాత మరలా భక్తులకు 48 రోజుల పాటు దర్శనమిస్తారు. శయన మూర్తిగా దర్శనం ఇచ్చే ఆఖరి రోజైన 31 వ తేదీ నాడు దర్శన వేళల్లో మార్పులు చేసినట్లు జిల్లా పాలనాధికారి పొన్నయ్యన్ తెలిపారు. 31 వ తేదీ బుధవారం ఉదయం ఐదు గంటల నుంచి మధ్యహ్నం 12 వరకు మాత్రమే సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఆన్ లైన్లో బుక్ చేసుకున్న వారిని మధ్యాహ్నం 12 నుంచి 3గంటల వరకు అనుమతిస్తారు.
స్వామి వారి అరుదైన దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశం నలుమూలల నుంచి కాంచీపురానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సహా పలువురు ప్రముఖులు అత్తి వరదున్ని దర్శించుకున్నారు.

నిల్చున్న మూర్తిగా అత్తివరద రాజస్వామి దర్శనం

నలభై ఏళ్ల పాటు ఆలయ కోనేటి గర్భంలో ఉండి 40 సంవత్సరాలకోసారి కంచి అత్తి వరద రాజస్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు. గత 29 రోజులుగా శయన మూర్తిగా ఆశీస్సులు అందిస్తున్న స్వామి వారు ఈ ఆగష్టు 1 నుంచి 17వ తేదీ వరకూ నిల్చున్న రూపంలో దీవించనున్నారు. ఆగష్టు 18వ తేదీన వరదరాజ స్వామి తిరిగి ఆలయ కోనేటి జలగర్భంలోకి వెళ్లనున్నారు. మరో 40 సంవత్సరాల తర్వాత మరలా భక్తులకు 48 రోజుల పాటు దర్శనమిస్తారు. శయన మూర్తిగా దర్శనం ఇచ్చే ఆఖరి రోజైన 31 వ తేదీ నాడు దర్శన వేళల్లో మార్పులు చేసినట్లు జిల్లా పాలనాధికారి పొన్నయ్యన్ తెలిపారు. 31 వ తేదీ బుధవారం ఉదయం ఐదు గంటల నుంచి మధ్యహ్నం 12 వరకు మాత్రమే సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఆన్ లైన్లో బుక్ చేసుకున్న వారిని మధ్యాహ్నం 12 నుంచి 3గంటల వరకు అనుమతిస్తారు.
స్వామి వారి అరుదైన దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశం నలుమూలల నుంచి కాంచీపురానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సహా పలువురు ప్రముఖులు అత్తి వరదున్ని దర్శించుకున్నారు.

Intro:ఈశ్వరాచారి.... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్

యాంకర్...అవసరానికి డబ్బులు ఇస్తాడు తిరిగి తీసుకునే సమయంలో అధిక మొత్తంలో వడ్డీ చెల్లించమని వేధిస్తూ ఉంటాడు. ఉద్యోగులనే అతను ఎంచుకుని వారికే డబ్బులు ఇస్తాడు డబ్బులు ఇచ్చే సమయంలో 2 రూపాయలు వడ్డీ అని చెప్తాడు తిరిగి తీసుకునే సమయంలో 10 రూపాయల వడ్డీ లెక్క కడతారు. దానితో పాటు వడ్డీ కి డబ్బులు ఇచ్చే సమయంలో ఖాళీ చెక్కులు, ప్రామాసరీ నోట్లు తీసుకుని తిరిగి ఇవ్వకుండా వేధించడం అతని స్టయిల్.

కుటుంబ అవసరాల నేపథ్యంలో కొండమడుగుల రత్నారెడ్డి అనే వడ్డీ వ్యాపారి వద్ద 30 వేలు అప్పగా తీసుకున్నాడు. అప్పు తీసుకునే సమయంలో 2 రూపాయల వడ్డీ, ఖాళీ చెక్కులు, ఖాళీ ప్రమిసరీ నోట్ లు పూచీకత్వం కింద వ్యాపారి తీసుకున్నారని బాధితుడు విజయబాబు తెలిపాడు.అప్పు చెల్లించే సమయంలో 10 వడ్డీ చెల్లించాలంటూ వ్యాపారి అడ్డం తిరిగి ఇబ్బందులు కు గురిచేస్తున్నారని అతను ఆడిగినట్లే చెల్లించిన చెక్కులు , ప్రమాసిరి నోట్ల తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నారని బాధితులు వాపోయారు. మరో బాధితుడి తాను 50 వేలు నగదు అప్పుగా తీసుకున్నామని మొదటిలో 2 రూపాయలు వడ్డీ అని చెప్పి ఇప్పుడు 10 రూపాయల వడ్డీ కట్టాలని లేదంటే చెక్కులు , నాట్ లు ఇవ్వనంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితుడు రంగుజీ తెలిపాడు.

ఇప్పటికి వడ్డీ వ్యాపారి రత్నారెడ్డి పై 200 పైగా కేసులు నమోదు అయ్యాయన్నారు. అతని పై కాల్ మనీ కేసు నమోదు చేయాలంటూ బాధితులు అందరూ నేడు నిర్వహించిన స్పందన కార్యక్రమంలో అర్బన్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.


Body:బైట్....విజయ్ బాబు...బాధితుడు

బైట్...రంగుజీ...బాధితుడు.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.