ETV Bharat / state

వైకాపా సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది: శైలజానాథ్

author img

By

Published : Apr 15, 2021, 3:09 PM IST

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వాలంటీర్లు, అధికార వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్​ను గెలిపిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామని హామీ ఇచ్చారు.

apcc president sailajanath
పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్

వాలంటీర్లు, అధికార వ్యవస్థను అడ్డుపెట్టుకొని వైకాపా ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో.. తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం నిర్వహించిన ఆయన... పెద్దపెద్ద బ్యాగులతో వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులు తిరుపతిలో తిష్ఠ వేశారని ఆరోపించారు.

తిరుపతిలో ఎంపీ అభ్యర్థి ఓడిపోతే తమ పార్టీల ఎంపీలందరూ రాజీనామా చేస్తామన్న వైకాపా... రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, దుగ్గరాజుపట్నం పోర్ట్, మన్నవరం భెల్ పరిశ్రమను తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి:

వాలంటీర్లు, అధికార వ్యవస్థను అడ్డుపెట్టుకొని వైకాపా ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో.. తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం నిర్వహించిన ఆయన... పెద్దపెద్ద బ్యాగులతో వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులు తిరుపతిలో తిష్ఠ వేశారని ఆరోపించారు.

తిరుపతిలో ఎంపీ అభ్యర్థి ఓడిపోతే తమ పార్టీల ఎంపీలందరూ రాజీనామా చేస్తామన్న వైకాపా... రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, దుగ్గరాజుపట్నం పోర్ట్, మన్నవరం భెల్ పరిశ్రమను తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి:

తిరుపతి ఉప ఎన్నిక​పై.. రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి వీడియో కాన్ఫరెన్స్

కుంభమేళాలో 1,701 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.