ETV Bharat / state

ఆలయ నిర్మాణాన్ని పరిశీలించిన తితిదే చైర్మన్

రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాన్ని తితిదే చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి  పరిశీలించారు. పనుల గురించి ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

author img

By

Published : Jul 1, 2019, 10:24 PM IST

ttd-chairmen-yv-subbareddy-observed-srivenkateshwara-temple-works-at-amaravathi

తుళ్లూరు మండలం వెంకటాపాలెంలో నిర్మిస్తున్న శ్రీనివాసుడి ఆలయ నిర్మాణ పనుల గురించి తితిదే చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరా తీశారు. 150 కోట్ల అంచనా వ్యయంతో జనవరిలో స్వామి వారి ఆలయానికి శంకుస్థాపన జరిగింది. అప్పటి నుంచి కొనసాగుతున్న పనుల గురించి సుబ్బారెడ్డి ఆరా తీశారు. ఉపరితలమంతా రాతి కట్టడం కావడంతో మూడు ప్రాంతాల్లో ఆకృతులకు సంబంధించి పనులు జరుగుతున్నట్లు చీఫ్‌ ఇంజనీరు చంద్రశేఖర్‌రెడ్డి వివరించారు. ఆలయ పునాదులకు సంబంధించి ఎర్త్ వర్క్ జరుగుతోందని ఆయన తెలిపారు.

అమరావతిలో ఆలయ నిర్మాణాన్ని పరిశీలించిన తితిదే ఛైర్మన్​

తుళ్లూరు మండలం వెంకటాపాలెంలో నిర్మిస్తున్న శ్రీనివాసుడి ఆలయ నిర్మాణ పనుల గురించి తితిదే చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆరా తీశారు. 150 కోట్ల అంచనా వ్యయంతో జనవరిలో స్వామి వారి ఆలయానికి శంకుస్థాపన జరిగింది. అప్పటి నుంచి కొనసాగుతున్న పనుల గురించి సుబ్బారెడ్డి ఆరా తీశారు. ఉపరితలమంతా రాతి కట్టడం కావడంతో మూడు ప్రాంతాల్లో ఆకృతులకు సంబంధించి పనులు జరుగుతున్నట్లు చీఫ్‌ ఇంజనీరు చంద్రశేఖర్‌రెడ్డి వివరించారు. ఆలయ పునాదులకు సంబంధించి ఎర్త్ వర్క్ జరుగుతోందని ఆయన తెలిపారు.

Intro:Ap_cdp_47_01_prati patasala_anada vedika_Av_Ap10043
ప్రతి పాఠశాల ఆనంద వేదిక కావాలని ఎంఈఓ చంగల్ రెడ్డి తెలిపారు. రాజంపేట పట్టణం మన్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం మండలంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు ఆనంద వేదికపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 4 నుంచి ప్రతి పాఠశాలలో పాఠశాల ప్రారంభం కాగానే మొదటి అరగంట విద్యార్థులు ఆనందంగా ఉండేలా నిర్దేశించిన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ధ్యానం, భావవ్యక్తీకరణ, కథలు చెప్పడం వంటి కార్యక్రమాలను చేపట్టాలన్నారు. దీని ద్వారా విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గుతుందని, మానసికంగా, శారీరకంగా దృఢత్వం కలిగి ఉంటారని చెప్పారు. ఫలితంగా విద్యార్థులు చక్కగా చదువుకొని, బోధించే అంశాలను అర్థం చేసుకునే పరిజ్ఞానం తగ్గుతుందని తెలిపారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఈ నెల 3న ప్రతి పాఠశాలలో మిగిలిన ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని, సంపూర్ణ అవగాహన కల్పించాలని సూచించారు..


Body:పాఠశాల ఆనంద వేదిక కావాలి


Conclusion:కడప జిల్లా రాజంపేట
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.