ETV Bharat / state

ఎగ్జిట్ పోల్సే... ఎగ్జాక్ట్​ 'పల్స్' కాదు..!?

ఎన్నికలు ముగిసిన మరుక్షణమే చాలా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంటూ తమతమ అంచనాలు వెల్లడించాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలామందికి వాటిపై నమ్మకం సన్నగిల్లుతోంది. అసలు ఎగ్జిట్ పోల్స్​కు సర్వేలకు ఉన్న తేడా ఏంటీ... ఎగ్జిట్ పోల్స్‌లో ఓటర్ల అభిప్రాయాలు ఎలా సేకరిస్తారు... సర్వేలో ప్రజల నాడి ఎలా పసిగడతారు అనే విషయాలు చాలామందికి తెలియక... ఎగ్జిట్ పోల్స్​నే ఎగ్జాక్ట్​ 'పల్స్' అనుకుంటారు.

author img

By

Published : May 21, 2019, 3:44 PM IST

ఎగ్జిట్ పోల్సే... ఎగ్జాక్ట్​ 'పల్స్' కాదు
ఎగ్జిట్ పోల్సే... ఎగ్జాక్ట్​ 'పల్స్' కాదు

ఎగ్జిట్ పోల్స్ అంటే...
పోలింగ్ జరిగే రోజు... ఓటు వేసి బయటకు వచ్చిన కొందరిని ఎవరికి ఓటేశారు..? ఏ పార్టీకి ఓటేశారు అనే ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో నియోజకవర్గంలో సుమారు 10 పోలింగ్ కేంద్రాలు ఎంపిక చేసుకుంటారు. వాటిల్లో ఓటు వేసి వచ్చేవారి అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఎక్కువలో ఎక్కువ ఒక నియోజకవర్గంలో వెయ్యిమంది అభిప్రాయాలు తెలుసుకుంటారు. అందులో యువకులు, వృద్ధులు, మహిళలు, పురుషులు అనే తేడా ఉండదు. ర్యాండమ్​గా అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఎగ్జిట్ పోల్స్ శాస్త్రీయంగా జరగవు. అందుకే చాలాసార్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారవుతాయి.

సర్వే ఇలా చేస్తారు...
ఎగ్జిట్ పోల్స్​లా కాకుండా సర్వేను శాస్త్రీయంగా చేస్తారు. అంటే ఎన్నికల ముందే ప్రతీ నియోజకవర్గంలో ఒకసారి సర్వే చేస్తారు. ఈ సర్వేలో ఒక్కో నియోజకవర్గం నుంచి సుమారు 1500 నుంచి 2వేల మంది అభిప్రాయాలు సేకరిస్తారు. ఎన్నికలు ముగిశాక మరోసారి చేస్తారు. ఈ రెండింటిని పోల్చి అంచనాలు వెల్లడిస్తారు. సర్వేలో ప్రస్తుత అధికార పార్టీ పనితీరు, పాలన, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, నేతల పనితీరు, మళ్లీ ఎవరు మీ ప్రతినిధిగా ఉండాలి వంటి వాటి గురించి గురించి క్లుప్తంగా తెలుసుకుంటారు. సర్వే సంస్థ ప్రతినిధులు ఒక్కొక్కరిని 15 నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. దీనిని శాస్త్రీయ సర్వే అంటారు. సర్వేల అంచనాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో పోలిస్తే కచ్చితంగా ఉంటాయి.

ఒక్క లగడపాటి మినహా...
ఈసారి... ఒక్క లగడపాటి రాజగోపాల్ మినహా అందరూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలే వెల్లడించారు. లగడపాటి మాత్రమే శాస్త్రీయ సర్వే చేయించారు. కొన్ని పార్టీలకు వారివారి అనుకూల మీడియా సంస్థలు అతిఎక్కువ స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. అవన్నీ శాస్త్రీయంగా జరిగిన సర్వేలు కావు.

ఎగ్జిట్ పోల్సే... ఎగ్జాక్ట్​ 'పల్స్' కాదు

ఎగ్జిట్ పోల్స్ అంటే...
పోలింగ్ జరిగే రోజు... ఓటు వేసి బయటకు వచ్చిన కొందరిని ఎవరికి ఓటేశారు..? ఏ పార్టీకి ఓటేశారు అనే ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో నియోజకవర్గంలో సుమారు 10 పోలింగ్ కేంద్రాలు ఎంపిక చేసుకుంటారు. వాటిల్లో ఓటు వేసి వచ్చేవారి అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఎక్కువలో ఎక్కువ ఒక నియోజకవర్గంలో వెయ్యిమంది అభిప్రాయాలు తెలుసుకుంటారు. అందులో యువకులు, వృద్ధులు, మహిళలు, పురుషులు అనే తేడా ఉండదు. ర్యాండమ్​గా అభిప్రాయాలు తెలుసుకుంటారు. ఎగ్జిట్ పోల్స్ శాస్త్రీయంగా జరగవు. అందుకే చాలాసార్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారవుతాయి.

సర్వే ఇలా చేస్తారు...
ఎగ్జిట్ పోల్స్​లా కాకుండా సర్వేను శాస్త్రీయంగా చేస్తారు. అంటే ఎన్నికల ముందే ప్రతీ నియోజకవర్గంలో ఒకసారి సర్వే చేస్తారు. ఈ సర్వేలో ఒక్కో నియోజకవర్గం నుంచి సుమారు 1500 నుంచి 2వేల మంది అభిప్రాయాలు సేకరిస్తారు. ఎన్నికలు ముగిశాక మరోసారి చేస్తారు. ఈ రెండింటిని పోల్చి అంచనాలు వెల్లడిస్తారు. సర్వేలో ప్రస్తుత అధికార పార్టీ పనితీరు, పాలన, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, నేతల పనితీరు, మళ్లీ ఎవరు మీ ప్రతినిధిగా ఉండాలి వంటి వాటి గురించి గురించి క్లుప్తంగా తెలుసుకుంటారు. సర్వే సంస్థ ప్రతినిధులు ఒక్కొక్కరిని 15 నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. దీనిని శాస్త్రీయ సర్వే అంటారు. సర్వేల అంచనాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో పోలిస్తే కచ్చితంగా ఉంటాయి.

ఒక్క లగడపాటి మినహా...
ఈసారి... ఒక్క లగడపాటి రాజగోపాల్ మినహా అందరూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలే వెల్లడించారు. లగడపాటి మాత్రమే శాస్త్రీయ సర్వే చేయించారు. కొన్ని పార్టీలకు వారివారి అనుకూల మీడియా సంస్థలు అతిఎక్కువ స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. అవన్నీ శాస్త్రీయంగా జరిగిన సర్వేలు కావు.

Intro:ap_cdp_19_21_rtc_zonal_chairmen_av_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
ఆర్టీసీ బస్టాండ్ లో ఎమ్మార్పీ ధరలకే వస్తువులను విక్రయించాలని కడప ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మార్పీ ధర కన్నా ఒక్క రూపాయి ఎక్కువ ధర తీసుకున్నప్పటికీ దుకాణాన్ని రద్దు చేస్తామని స్పష్టం చేశారు. కడప ఆర్టీసీ బస్టాండ్ లో జోనల్ చైర్మన్ ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా టికెట్లు రిజర్వేషన్ కోసం, ప్రయాణికులు బస్సు ఎక్కించేందుకు వచ్చే వారి నుంచి విజిలెన్స్ అధికారులు 50 నుంచి 100 రూపాయలు జరిమానా వేస్తున్నట్లు చైర్మన్ దృష్టికి రావడంతో జరిమానాలు విధించే వద్దని విజిలెన్స్ అధికారులను సూచించారు. ఎక్కువ ధరలకు విక్రయిస్తున్న దుకాణాలకు నోటీసులు జారీ చేయాలని సూచించారు. అనంతరం భోజనశాల ను తనిఖీ చేశారు తయారు చేస్తున్న భోజనాన్ని పరిశీలించారు. బాత్రూం లను పరిశీలించి శుభ్రంగా ఉంచుకోవాలని అని సూచించారు.


Body:ఆర్టీసీ జోనల్ చైర్మన్ తనిఖీ


Conclusion:కడప ప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.