ముఖ్యమంత్రి జగన్పై నారా లోకేశ్ మరోసారి ట్వీట్టర్లో బాణాలు సంధించారు. రైతుల పేరుతో సీఎం జగన్ వికృత రాజకీయం మొదలుపెట్టారని... అసెంబ్లీ సాక్షిగా అడ్డంగా దొరికిపోయారని ధ్వజమెత్తారు. 'బడ్జెట్ పత్రాల్లో 1,513 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చూపించారు. కానీ అందులో 391 మందివి మాత్రమే రైతుల ఆత్మహత్యలు అని జిల్లా స్థాయి త్రిసభ్య కమిటీల ద్వారా తేల్చారు. అదే అసెంబ్లీ సమావేశాల్లో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా... 1160 రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. అందులో 454 మందివి రైతుల ఆత్మహత్యలుగా తేల్చినట్లు చెప్పారు. తెదేపా హయాంలో రైతుల ఆత్మహత్యలు అంటూ దొంగలెక్కలు మాని మీ నాన్నగారి హయాంలో చనిపోయిన 15 వేలమంది రైతులకు ఓదార్పునివ్వాలని ప్రార్థన' అంటూ లోకేశ్ ట్వీట్లు చేశారు. వీటికి రెండు పత్రాలను జత చేశారు.
![ట్వీట్లోని పత్రాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3885441_nara5.jpg)
![ట్వీట్లోని పత్రాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3885441_nara2.jpg)