తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పలు కీలకశాఖల ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 12 నుంచి జరగనున్న బడ్జెట్ సమావేశాలపై ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే ముసాయిదా బిల్లులపై సీఎం చర్చించారు. సీఎం... సమీక్ష దృష్ట్యా 3 గంటలకు సచివాలయంలో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం నిర్వహించే శాఖాధిపతుల సమావేశం వాయిదా పడింది. సచివాలయంలో రేపు ఉదయం 11 గంటలకు శాఖాధిపతుల సీఎస్ సమావేశం జరగనుంది.
ఇదీ చదవండి.. గవర్నర్ నరసింహన్ ను కలిసిన సీఎం జగన్